
బలంగా భారత్..
'ప్రస్తుతం భారత జట్టు చాలా బలంగా ఉందనేది నా అభిప్రాయం. అయితే సొంతగడ్డపై భారత్ను ఓడిస్తే అది ఇంగ్లండ్కు ఖచ్చితంగా యాషెస్ సిరీస్ కంటే గొప్ప విజయం అవుతుంది. భారత్ జట్టు ఇటీవలే ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డ ఓడించింది. వాస్తవానికి ఆస్ట్రేలియాను వారి స్వదేశంలో ఓడించడం చాలా కష్టం. ఇక భారత్ పిచ్లపై స్పిన్నర్లను ఎదుర్కోవడం ఇప్పుడు ఇంగ్లండ్ ముందున్న అతిపెద్ద సవాల్.

శ్రీలంకలో చూపించిన జోరే...
శ్రీలంకలో చూపించిన జోరునే ఇంగ్లండ్ కొనసాగిస్తుందనుకుంటున్నా. ముఖ్యంగా బంతితో భారత్లో చెలరేగుతారనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. శ్రీలంక బలహీనమైన బ్యాటింగ్ ఇంగ్లండ్కు కలిసొచ్చిందనేది వాస్తవం. మా స్పిన్నర్లు డామ్ బెస్, జాక్ లీస్ అద్భుతంగా రాణించారు. ప్రస్తుతానికి వరల్డ్ క్లాస్ ప్లేయర్లు కాకున్నా కొన్నేళ్లలో వారు కీలక స్పిన్నర్లుగా ఎదుగుతారు. శ్రీలంక కన్నా భారత జట్టు ఎన్నో రెట్లు బలమైనదనే విషయం వారికి తెలుసు.

పిచ్చి నిర్ణయం..
ఇక భారత్ను ఒత్తిడిలో ఉంచాలంటే ఇంగ్లండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో భారీ స్కోర్ చేయాలి. కాకపోతే ఇంగ్లండ్ జోరూట్పైనే ఎక్కువగా ఆధారపడింది. ఇతర బ్యాట్స్మెన్ కూడా రాణించాల్సిన అవసరం ఉంది. ఇక ఈ సిరీస్లోని తొలి రెండు టెస్ట్లకు బెయిర్ స్టోను పక్కనపెట్టడం ఆశ్చర్యానికి గురిచేసింది. అలాంటి వరల్డ్ క్లాస్ బ్యాట్స్మన్కు ఎవరైనా విశ్రాంతినిస్తారా? ఇదో పిచ్చి నిర్ణయం. ఇక అశ్విన్ వరల్డ్ క్లాస్ ఆఫ్ స్పిన్నర్. అతను భారత్కు దొరికి ఓ ఆణిముత్యం.

భారత్దే సిరీస్..
అశ్విన్ను ఎదుర్కొవాలంటే ఇంగ్లండ్ బ్యాట్స్మన్ అంతా జోరూట్ను అనుసరించాలి. ఎందుకంటే అతనికి అశ్విన్పై మంచి రికార్డు ఉంది. స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కొనే టెక్నిక్ ఉంది. చాలా సెలెక్టివ్ షాట్స్ ఆడుతాడు. ఈ సిరీస్లో నా అంచనా ప్రకారం భారత్ 2-1తో గెలుస్తుంది. అయితే ఓ ఇంగ్లీష్ క్రికెటర్గా ఇది తప్పిదం కావాలని కోరుకుంటున్నా.'అని గ్రేమ్ స్వాన్ తెలిపాడు. 2008లో భారత్ గడ్డపైనే టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన గ్రేమ్ స్వాన్.. ఆ టూర్లో తేలిపోయాడు. కానీ.. నాలుగేళ్ల తర్వాత మళ్లీ భారత్కి వచ్చిన ఇంగ్లండ్ టీమ్ టెస్టు సిరీస్ను 2-1తో గెలవడంలో క్రియాశీలక పాత్ర పోషించాడు.


Click it and Unblock the Notifications












