For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs England: మనీష్ పాండేపై వేటు.. మండిపడ్డ ఆకాశ్ చోప్రా!

India vs England: Aakash Chopra on India batsman Manish Pandey after T20 snub from England series
Ind vs Eng 2021,3rd Test: Aakash Chopra On Manish Pandey After T20 Snub From England Series

న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు టీ20ల సిరీస్ నుంచి యువ ప్లేయర్ మనీష్ పాండేను తప్పించడంపై టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా ఆగ్రహం వ్యక్తం చేశాడు. అవకాశాలివ్వకుండా వేటువేయడం ద్వారా మనీష్ పాండే కెరీర్‌ను భారత సెలెక్టర్లు ప్రశ్నార్థకంలోకి నెట్టేశారని మండిపడ్డాడు. అహ్మదాబాద్‌లోని మోతెరా స్డేడియం వేదికగా మార్చి 12-20 తేదీల్లో జరిగే ఈ సిరీస్‌ కోసం 19 మంది సభ్యులతో కూడిన జట్టును శనివారం ఆలిండియా సీనియర్ సెలెక్షన్ కమిటీ ప్రకటించింది.

కొత్తగా ముగ్గురికి చాన్స్..

కొత్తగా ముగ్గురికి చాన్స్..

ఇందులో సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, వరుణ్ చక్రవర్తికి చోటిచ్చిన భారత సెలెక్టర్లు.. మనీశ్ పాండే, సంజు శాంసన్, కుల్దీప్ యాదవ్‌పై వేటు వేశారు. ఆస్ట్రేలియాతో ఇటీవల ముగిసిన టీ20 సిరీస్‌లో సంజు శాంసన్ బ్యాటింగ్‌లో నిరాశపరచగా.. మనీశ్ పాండేకు గత కొంతకాలంగా అసలు తుది జట్టులోనే అవకాశాలు దక్కడం లేదు. అవకాశాలు ఇవ్వకుండా వేటు వేయడం ఏ మాత్రం సమంజం కాదని చోప్రా అభిప్రాయపడ్డాడు.

అవకాశం ఇవ్వకుండా..

అవకాశం ఇవ్వకుండా..

'భారత వన్డే, టీ20 జట్టులో మనీశ్ పాండే రెగ్యులర్‌ ఆటగాడు. కానీ.. తాజాగా అతనిపై వేటు వేయడం ద్వారా అతని అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ప్రశ్నార్థకంలోకి నెట్టినట్లయింది. గతంలో తుది జట్టులో అతనికి పెద్దగా అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడేమో ఆప్షన్స్ వెతుకుతున్నారు'అని సెలెక్టర్ల తీరును ఆకాశ్ చోప్రా విమర్శించాడు. ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరీస్‌లో 48 పరుగులే చేసిన వికెట్ కీపర్/ బ్యాట్స్‌మెన్ సంజు శాంసన్.. మూల్యం చెల్లించుకున్నాడని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.

సంజూపై వేటు..

సంజూపై వేటు..

మధ్యప్రదేశ్‌తో శనివారం జరిగిన విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో జార్ఖండ్ తరఫున ఆడిన వికెట్ కీపర్/ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్.. 94 బంతుల్లోనే 19 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 173 పరుగులు చేశాడు. దాంతో.. సంజు శాంసన్ స్థానంలో ఇషాన్ కిషన్‌కి టీ20 జట్టులో భారత సెలెక్టర్లు అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. అలానే ఐపీఎల్ 2020 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు ఆడిన సూర్యకుమార్ యాదవ్ 480 పరుగులు చేశాడు.

Story first published: Sunday, February 21, 2021, 20:43 [IST]
Other articles published on Feb 21, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+