1988 తర్వాత తొలిసారి..
1988 తర్వాత బ్రిస్బేన్లోని గబ్బా మైదానంలో తొలిసారి కంగారులకు ఓటమి ఎదురైంది. గత 33 ఏళ్లలో ఆడిన 31 టెస్టుల్లో 24 మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. 1988లో వెస్టిండీస్ చివరిసారిగా ఇక్కడ టెస్టు మ్యాచ్ గెలిచింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే భారత్ చేతిలో ఆసీస్ ఓడింది.
గబ్బా వేదికగా జరిగిన టెస్టు(1988)లో ఆస్ట్రేలియాపై విజయం సాధించిన చివరి జట్టు వెస్టిండీస్. అలాగే ఇక్కడ అత్యధిక ఛేదన కూడా విండీస్ పేరిటే ఉండేది. 1951లో జరిగిన టెస్టు నాలుగో ఇన్నింగ్స్లో ఈ జట్టు 236 పరగుల లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. ప్రస్తుతం టీమిండియా ఈ రికార్డును తిరగరాసింది. గబ్బా మైదానంలో 328 పరగుల లక్ష్యాన్ని ఛేదించి అందరి చేత ప్రశంసలు అందుకుంటోంది. అంతేకాకుండా టీమిండియా చేజింగ్ రికార్డుల్లో తాజా మ్యాచ్ మూడోది కాగా.. ఆసీస్ గడ్డపై కూడా మూడో స్థానంలో నిలిచింది.
టీమిండియా అత్యధిక ఛేదన
1975/76 సీజన్లో వెస్టిండీస్పై 406 పరుగులు
2008/09 సీజన్లో ఇంగ్లండ్పై 387 రన్స్
2020/21 సీజన్లో ఆస్ట్రేలియాపై 328 పరుగులు (తాజా మ్యాచ్)
2011/12 సీజన్లో వెస్టిండీస్పై 276 పరుగులు
2001లో శ్రీలంకపై 264 పరుగుల ఛేదన
ఆస్ట్రేలియా గడ్డపై అత్యధిక పరుగులు..
2008/09 : పెర్త్ వేదికగా జరిగిన టెస్టులో దక్షిణాఫ్రికా 414 పరుగులను చేధించింది.
1928/29 : మెల్బోర్న్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ 332 పరుగులు అధిగమించింది.
2020/21 : గబ్బా వేదికగా జరిగిన నాలుగో టెస్టులో భారత్ 329 పరుగుల చేధించింది.
తొలి టెస్టు ఓడాక భారత్ సిరీస్ గెలిచిన సందర్భాలు..
1972/73 సీజన్లో స్వదేశంలో ఇంగ్లండ్పై 2-1 తేడాతో గెలుపు
2000/01 సీజన్లో స్వదేశంలో ఆస్ట్రేలియాపై 2-1 తేడాతో గెలుపు
2015లో శ్రీలంక గడ్డపై ఆ జట్టుపైనే 2-1 తేడాతో విజయం
2016/17 సీజన్లో స్వదేశంలో ఆస్ట్రేలియాపై 2-1 తేడాతో విజయం
2020/21 సీజన్లో ఆస్ట్రేలియా గడ్డపై 2-1 తేడాతో గెలుపు*
ఐదో రోజు అత్యధిక పరుగులు
1948 లీడ్స్ : 404(ఆస్ట్రేలియా vs ఇంగ్లండ్)
1984 లార్డ్స్ : 344 (వెస్టిండీస్ vs ఇంగ్లండ్)
2020/21 బ్రిస్బేన్ : 325(భారత్ vs ఆస్ట్రేలియా) (తాజా మ్యాచ్)
1977/78 పెర్త్: 317(ఆస్ట్రేలియా vs భారత్)
2017 లీడ్స్: 317(వెస్టిండీస్ vs ఇంగ్లండ్)