న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టెస్టు సిరీస్‌కు రోహిత్‌ శర్మ దూరం.. యువ ప్లేయర్‌కు అవకాశం!!

India vs Australia: Shreyas Iyer likely to select as a reserve batsman for Test series

ముంబై: నవంబర్‌ 27 నుంచి ప్రారంభం కానున్న ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది. వన్డే, టీ20 అనంతరం అడిలైడ్‌లో మొదటి టెస్ట్ డిసెంబర్ 17న ప్రారంభమవుతుంది. అయితే టెస్టు సిరీస్‌లో స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ, సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ ఆడటం అనుమానంగా మారింది. ప్రస్తుతం వీరిద్దరు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో శిక్షణ పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా రోహిత్, ఇషాంత్ ఫిట్‌నెస్‌పై ఎటువంటి పురోగతి కనిపించకపోవడంతో టెస్టు సిరీస్‌కు దూరమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

రోహిత్‌ స్థానంలో అయ్యర్‌

రోహిత్‌ స్థానంలో అయ్యర్‌

రోహిత్‌ శర్మ, ఇషాంత్‌ శర్మ పూర్తిస్థాయిలో గాయం నుంచి కోలుకోకపోవడంతో ఆసీస్‌కు వెళ్తారా లేదా అన్న అంశంపై ప్రస్తుతం సందిగ్దత నెలకొంది. ఈ నేపథ్యంలో రోహిత్‌ స్థానంలో భారత యువ ఆటగాడు, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ను ఆడించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. అయ్యర్‌ను రిజర్వ్‌ ఆటగాడిగా తీసుకునే అవకాశాన్ని బీసీసీఐ పరిశీలిస్తోందని తెలుస్తోంది. ఒకవేళ అదే జరిగితే భారత్ తరఫున వన్డే, టీ20 మ్యాచ్‌లు ఆడిన అ‍య్యర్..‌ టెస్టుల్లో కూడా అరంగేట్రం చేసేందుకు మార్గం సుగమమవుతుంది. గతకొంత కాలంగా పరిమిత ఓవర్ల ఫార్మాట్లో అయ్యర్‌ రాణిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా వన్డేల్లో నాలుగో స్థానంలో అద్భుతంగా ఆడుతున్నాడు.

టీమిండియాకు కోలుకోలేని దెబ్బ

టీమిండియాకు కోలుకోలేని దెబ్బ

గతేడాది దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో ఓపెనర్‌గా వరుసగా డబుల్‌ సెంచరీ, సెంచరీతో చెలరేగిన రోహిత్‌ శర్మ గాయం కారణంగా జట్టుకు దూరమైతే టీమిండియాకు కోలుకోలేని దెబ్బ తగులుతుంది. ఇప్పటికే మొదటి టెస్టు తర్వాత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ భారత్‌కు తిరిగి రానున్న విషయం తెలిసిందే. దీంతో హిట్‌మ్యాన్‌ కూడా అందుబాటులో లేకుంటే బ్యాటింగ్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అదే సమయంలో భారత పేస్ బృందంకు నాయకత్వం వహిస్తున్న ఇషాంత్ దూరమవడం కూడా కూడా జట్టుపై ప్రభావం చూపనుంది.

ఓపెనర్‌గా గిల్

ఓపెనర్‌గా గిల్

ఇక వన్డే, టీ20ల సిరీస్‌కు ఓపెనర్‌ రోహిత్ శర్మ పూర్తిగా దూరమవ్వడంతో శిఖర్ ధావన్‌తో ఇన్నింగ్స్‌ను ఎవరు ఆరంభిస్తారని అందరిలోనూ ఆసక్తి పెరిగింది. కేఎల్‌ రాహుల్ ఓపెనర్‌గా సత్తాచాటుతున్నప్పటికీ.. అతడు మిడిలార్డర్‌లోనే బ్యాటింగ్‌కు వస్తాడని వార్తలు వస్తున్నాయి. దీంతో మయాంక్‌ అగర్వాల్, శుభ్‌మన్ గిల్ ఇద్దరిలో ఒకరు ఓపెనర్‌గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే గిల్‌కు సూచనలు ఇస్తున్న చిత్రాన్ని టీమిండియా హెడ్ కోచ్‌ రవిశాస్త్రి ట్విటర్‌లో షేర్‌ చేయడంతో.. ధావన్‌తో కలిసి గిల్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభిస్తాడని వార్తలు వెలుబడుతున్నాయి.

వన్డేల్లో నాలుగో స్థానం పక్కా

వన్డేల్లో నాలుగో స్థానం పక్కా

వన్డేల్లో శ్రేయస్‌ అయ్యర్‌కు స్థానం పక్కాగా మారిన విషయం తెలిసిందే. తొలి వన్డేకు తుది జట్టులో 9 ఆటగాళ్ల స్థానాలు దాదాపు ఖరారైనట్లే. శిఖర్‌ ధావన్‌, విరాట్ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్ రాహుల్, హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చహల్‌, జస్ప్రీత్ బుమ్రా తుది జట్టులో ఉంటారు. మొహమ్మద్ షమీతో పాటు నవదీప్ సైనీని తీసుకుంటే శార్దూల్‌ ఠాకూర్‌కు నిరాశ తప్పదు. ఒకవేళ టీ20లు, టెస్టు సిరీస్‌లను దృష్టిలో ఉంచుకుని బుమ్రా, షమీలో ఒకరికి విశ్రాంతినిచ్చే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు శార్దూల్‌కు తొలి వన్డేలో ఆడే అవకాశం లభిస్తుంది.

'అతడు 5 రెట్లు మెరుగయ్యాడు!! టాప్‌ ఆర్డర్‌లో రాణిస్తాడు.. ఫినిషర్‌గానూ సత్తాచాటగలడు'

Story first published: Tuesday, November 24, 2020, 12:47 [IST]
Other articles published on Nov 24, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X