
బుమ్రా ఉంటే జట్టుకు లాభం..
'బ్రిస్బేన్ మైదానం భిన్నమైంది. టీమిండియాకు కచ్చితంగా సవాళ్లు ఎదురవుతాయి. ఒకవేళ జస్ప్రీత్ బుమ్రా ఆడితే జట్టుకు ప్రయోజనం కలుగుతుంది. గాయాలతో సీనియర్లు, కీలక ఆటగాళ్లు లేకపోయినా రిజర్వు బెంచ్ పటిష్టంగానే ఉంది. వారికి సుదీర్ఘ ఫార్మాట్లో దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం దొరుకుతుంది. ఏదేమైనా సిరీసులో ఆఖరి మ్యాచ్ కావడంతో రెండు జట్లు హోరాహోరీగా తలపడటం ఖాయం.

అనేక సవాళ్లు..
టీమిండియా ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. సగానికి పైగా ఆటగాళ్లు గాయపడ్డారు. కీలక ఆటగాళ్లు లేని లోటు కచ్చితంగా ఉంటుంది. ఇప్పటికైతే తుది 11 మంది ఆడటమే కష్టంగా అనిపిస్తోంది. గాయాల నేపథ్యంలో రిజర్వుబెంచ్లో ఆటగాళ్లకు అవకాశాలు దక్కుతాయి. ఒకవేళ అశ్విన్ ఫిట్గా ఉంటే ఆడుతాడు. నిజానికి ఇదెంతో మంచివార్త. గాయాలు, జట్టుకు సంబంధించిన పూర్తి వివరాలపై గురువారాం క్లారిటీ రావచ్చు' అని మదన్ లాల్ తెలిపారు.

ఇంజ్యూరీ లిస్ట్
ఇక సిడ్నీ టెస్టు ముగిసే సరికి టీమిండియాలో గాయాల బారిన పడ్డ ఆటగాళ్ల జాబితా మరింత పెరిగింది. రవిచంద్రన్ అశ్విన్ వెన్నుముక నొప్పితో బాధపడుతున్నాడు. జస్ప్రీత్ బుమ్రా పొత్తికడుపు, రిషభ్ పంత్ మోచేతి నొప్పితో బాధపడుతున్నాడని తెలిసింది. అశ్విన్ కూడా నాలుగో టెస్టు ఆడటంపై అనుమానాలున్నాయి. ఇప్పటికే జడేజా, షమీ, ఉమేశ్ యాదవ్, హనుమ విహారీ గాయాలతోనే జట్టుకు దూరమయ్యారు. మయాంక్ అగర్వాల్ కూడా తొడకండరాల గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. ఈ ప్రతికూల పరిస్థితుల్లో భారత్ ఎలా రాణిస్తుందో? అనేది ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications
