
చివర్లో వర్షం రావడంతో మ్యాచ్ తారుమారు
మొత్తంగా ఈ మ్యాచ్లో ఆసీస్ 17ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 158పరుగులు సాధించింది. చివర్లో వర్షం రావడంతో డక్వర్త్ లూయిస్ విధానం ప్రకారం.. మ్యాచ్ను 17ఓవర్లకు కుదించి భారత్ లక్ష్యాన్ని 174పరుగులుగా సవరించారు. దానిని చేధించేందుకు పోరాడిన టీమిండియా ప్రధాన వికెట్లు కోల్పోవడంతో చేతులెత్తేసింది. దీంతో కేవలం 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.
తొలి టీ20: చివరి వరకు ఉత్కంఠ, 4 పరుగుల తేడాతో భారత్ ఓటమి

తొలి రెండు ఓవర్లలో కట్టడి.. తర్వాత
ఈ మ్యాచ్లో ఆల్రౌండర్గా బరిలోకి దిగిన కృనాల్ పాండ్య ఖాతాలో ఓ చెత్త రికార్డు వచ్చి చేరింది. తొలి రెండు ఓవర్లలో కృనాల్.. ఆసీస్ బ్యాట్స్మెన్ను కట్టడి చేసే ప్రయత్నం చేసినా.. మిగిలిన రెండు ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. మొత్తంగా నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన కృనాల్.. ఒక వికెట్ కూడా తీయకుండా 55పరుగులు సమర్పించుకున్నాడు.

భారీగా పరుగులు సమర్పించుకున్న పాండ్యా
ఇక ఎకానమీ కూడా 13.75 వరకు ఉంది. ఆసీస్ ఇన్నింగ్స్లో మొత్తం మీద తొమ్మిది సిక్స్లు ఉంటే.. కృనాల్ బౌలింగ్లోనే ఆసీస్ బ్యాట్స్మెన్ 6సిక్స్లు కొట్టారు. ఇలా టీ20ల్లో ఒక మ్యాచ్లో వికెట్లేమీ తీయకుండా భారీగా పరుగులు సమర్పించుకున్న భారతీయ బౌలర్ల జాబితాలో కృనాల్ పాండ్య మూడో స్థానంలో నిలిచాడు.

చాహల్తో పాటుగా అదే రికార్డు
అందరికంటే ముందు వరుసలో యుజ్వేంద్ర చాహల్(0/64) కొనసాగుతున్నాడు. ఈ ఏడాది దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో చాహల్ ఖాతాలో ఈ చెత్త రికార్డు వచ్చి చేరింది. రెండో స్థానంలో భారత మాజీ బౌలర్ జోగిందర్ శర్మ(0/57) ఉన్నాడు. 2007లో ఇంగ్లాండ్తో మ్యాచ్లో ఇది నమోదైంది.


Click it and Unblock the Notifications













