
విఫలమైన రహానే, విహారీ..
96/2 ఓవర్నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. ఆదిలోనే కెప్టెన్ అజింక్యా రహానే(22), హనుమ విహారీ(4) వికెట్లను చేజార్చుకుంది. కమిన్స్ బౌలింగ్లో రహానే క్లీన్ బౌల్డ్ కాగా.. హనుమ విహారీ రనౌట్గా వెనుదిరిగాడు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్(36)తో నయావాల్ చతేశ్వర్ పుజారా(50)ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. ఆచితూచి ఆడుతూ ఆసీస్ బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచాడు. మరోవైపు పంత్ కూడా తన శైలికి భిన్నంగా ఓపికగా ఆడటంతో భారత్ 180/4 స్కోర్తో లంచ్ బ్రేక్కు వెళ్లింది.

దెబ్బతీసిన గాయం..
పుజారా-పంత్ నిదానంగా ఆడుతుండటంతో భారత్ ఇన్నింగ్స్ మెరుగ్గానే అనిపించింది. కానీ కమిన్స్ బౌలింగ్లో ఓ బంతి రిషభ్ పంత్ లెఫ్ట్ ఎల్బోకు బలంగా తాకింది. దాంతో అతను నొప్పితో విలవిలలాడాడు. టీమిండియా ఫిజియో పరీక్షించి ప్రథమ చికిత్స చేయడంతో పంత్ బ్యాటింగ్ కొనసాగించాడు. కానీ మునపటిలా ఆడలేకపోయాడు. ఈ గాయం భారత బ్యాటింగ్ను దెబ్బతీసింది. నొప్పితో బ్యాటింగ్ చేయడానికి ఇబ్బంది పడ్డ పంత్.. హజెల్ వుడ్ బౌలింగ్లో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. ఈ వికెట్ ముందు బంతికే పుజారా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

49 రన్స్ 5 వికెట్లు..
హాఫ్ సెంచరీ పూర్తయిన మరుసటి ఓవర్లోనే కమిన్స్ బౌలింగ్లో పుజారా కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. ఈ వికెట్తో భారత పతనం మొదలైంది. క్రీజులోకి వచ్చిన బ్యాట్స్మెన్ అలానే పెవిలియన్కు క్యూ కట్టారు. రవిచంద్రన్ అశ్విన్(10) రనౌట్ కాగా.. నవ్దీప్ సైనీ(3) క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. ఆ తరువాత బుమ్రా(0) రనౌటయ్యాడు. ఇక సిరాజ్(6)తో జడేజా(28) కొంత పోరాడినప్పటికీ కమిన్స్ దెబ్బతీశాడు. సిరాజ్ను కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చి భారత్ ఇన్నింగ్స్ను ముగించాడు.


Click it and Unblock the Notifications
