బెంగళూరు : మూడు వన్డేల సిరీస్లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా భారత్తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా మిడిలార్డర్ బ్యాట్స్మెన్ స్టీవ్ స్మిత్(77 బ్యాటింగ్), మార్నస్ లబుషేన్(54) ఆకట్టుకున్నారు.
ఓపెనర్లు డేవిడ్ వార్నర్(3), ఆరోన్ ఫించ్(19) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగినా.. స్మిత్, లబుషేన్ బాధ్యతాయుతంగా ఆడుతూ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించారు. తొలుత 63 బంతుల్లో 8 ఫోర్లతో స్మిత్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా... అనంతరం 60 బంతుల్లో 5 ఫోర్లతో లబుషేన్ అర్థ శతకం సాధించాడు. స్మిత్కు ఇది 25వ హాఫ్ సెంచరీ కాగా.. లబుషేన్కు మాత్రం ఫస్ట్ హాఫ్ సెంచరీ. అయితే హాఫ్ సెంచరీ అనంతరం లబుషేన్ కోహ్లీ సూపర్ క్యాచ్కు వెనుదిరిగాడు. జడేజా వేసిన 32 ఓవర్ మూడో బంతిని లబుషేన్ డ్రైవ్ షాట్ ఆడగా. ఫార్వార్డ్ ఫీల్డర్ గా ఉన్న కోహ్లీ అద్భుత డైవ్తో బంతిని ఒడిసిపట్టుకున్నాడు.
ఈ సిరీస్లోని తొలి వన్డేతోనే ఇంటర్నేషనల్ క్రికెట్లోకి అడుగుపెట్టిన లబుషేన్.. నిలకడగా రాణిస్తున్నాడు. తొలి వన్డేలో బ్యాటింగ్ అవకాశం రాకపోగా.. రెండో వన్డేలో 47 పరుగులతో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. అంతకు ముందు టాస్ గెలిచి ఆస్ట్రేలియా బ్యాటింగ్కు దిగగా.. భారత పేసర్ మహ్మద్ షమీ ఆ జట్టుకు ఆదిలోనే షాకిచ్చాడు.
ఓపెనర్ డేవిడ్ వార్నర్(3) కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చి ఇండియాకు శుభారంభాన్నిచ్చాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన స్టీవ్ స్మిత్తో కెప్టెన్ ఫించ్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు. కానీ సమన్వయలోపంతో ఫించ్ రనౌట్గా వెనుదిరిగాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన లుబషేన్తో స్మిత్ బాధ్యాతాయుతంగా ఆడాడు. మంచి బంతులను గౌరవించిన ఈ జోడీ చెడ్డ బంతులను బౌండరీలకు తరలించింది. ప్రస్తుతం 31.3 ఓవర్లలో ఆసీస్ స్కోర్ 173/3.