తదుపరి మ్యాచ్కు బాగా ఉపయోగపడుతుందనే
మ్యాచ్ ఆద్యంతం బాగా జరిగింది. మాతో పాటు ఆస్ట్రేలియా కూడా విజయం కోసం తీవ్రంగా శ్రమించింది. ఈ మ్యాచ్లోని ప్రదర్శన ద్వారా ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకున్నాం. ఇందులో ఓడిపోయినప్పటికీ, ఆడిన తీరు తదుపరి మ్యాచ్కు బాగా ఉపయోగపడుతుందనే ఆశిస్తున్నాం. ఇది మేము గెలవాల్సిన మ్యాచే. కానీ ఫీల్డింగ్లో చేసిన కొన్ని తప్పిదాలతో భారీ మూల్యం చెల్లించుకున్నాం.
ప్రధానంగా క్యాచ్లను డ్రాప్ చేయడం, రనౌట్ చాన్స్ను వదులుకోవడమే దీనికి కారణం. వాటిని సద్వినియోగం చేసుకుని ఉంటే ఆసీస్ స్కోరు బోర్డుపై కొన్ని అదనపు పరుగుల్ని తగ్గించు ఉండేవాళ్లం. ఏదేమైనా మంచి గేమ్ ఆడాం.
సిక్స్ లేకుండా వన్డేల్లో అత్యధిక పరుగులు చేసి ఆటగాళ్లు ఎవరో తెలుసా?
ఫించ్ ఇచ్చిన సులభమైన క్యాచ్ను కోహ్లి
బుధవారం ఆసీస్తో జరిగిన టీ20 మ్యాచ్ నాల్గో ఓవర్లో ఆరోన్ ఫించ్ ఇచ్చిన సులభమైన క్యాచ్ను కోహ్లి వదిలేశాడు. అది మొదటిది కాగా, మార్కస్ స్టోనిస్ క్యాచ్ను ఖలీల్ అహ్మద్ జారవిడిచాడు ఇది రెండోది. ఇలా మ్యాక్స్వెల్ను రనౌట్ చేసే అవకాశాన్ని కూడా టీమిండియా చేజార్చుకుంది. ఈ తప్పిదాల కారణంగా భారత క్రికెట్ జట్టు ఫీల్డింగ్పై విమర్శల వర్షం కురుస్తోంది.
టీ20ల్లో ఒక సంవత్సరంలో అత్యధిక పరుగులు
ఇటీవల విండీస్తో సిరీస్లో విఫలమైన ఓపెనర్ శిఖర్ ధావన్.. బ్రిస్బేన్ వేదికగా ఆసీస్తో జరిగిన తొలి మ్యాచ్లో మెరుపు ఇన్నింగ్స్తో అదరగొట్టాడు. ఓపెనర్ రోహిత్(7), వన్డౌన్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్(13), కెప్టెన్ కోహ్లీ(4) తక్కువ పరుగులకే ఔట్ కావడంతో ఇన్నింగ్స్ నిలబెట్టే బాధ్యత ధావన్ తీసుకున్నాడు. కానీ ఇన్నింగ్స్ 12ఓవర్లో స్టాన్లేక్ బౌలింగ్ షాట్ ఆడే ప్రయత్నంలో శిఖర్ (76; 42 బంతుల్లో 10ఫోర్లు, 2సిక్సులు) బెరెన్డార్ఫ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. టీ20ల్లో ఒక సంవత్సరంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా ధావన్(646 పరుగులు, 2018లో) రికార్డు నెలకొల్పాడు.
కోహ్లీని దాటేసిన ధావన్
ఇప్పటివరకు టీ20ల్లో ఒక ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా కోహ్లీ(641 పరుగులు, 2016లో) పేరిట ఈ రికార్డు ఉండేది. తాజాగా ధావన్.. అతడిని అధిగమించనట్లయింది. ఇక ఈ ఏడాదిలో పొట్టి ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ జాబితాలో ఫఖర్ జామన్ (576), రోహిత్ శర్మ(567), బాబర్ అజామ్ (563), షాహెజాద్(520), అరోన్ ఫించ్(503) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.