
చెన్నై తరఫున నాలుగు సార్లు..
2008లో చెన్నై సూపర్ కింగ్స్లో ఐపీఎల్ కెరీర్ ఆరంభించిన అశ్విన్, ఆ తర్వాత రైజింగ్ పూణే సూపర్ జెయింట్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల తరుపున ఆడాడు. 2008లో రాజస్థాన్ రాయల్స్ చేతుల్లో ఫైనల్లో చెన్నై ఓడిపోగా.. ఆ సీజన్లో సీఎస్కే తరుపున ఆడిన రవిచంద్రన్ అశ్విన్, 2012, 2013, 2015 సీజన్లలో రన్నరప్గా ముగించిన చెన్నై టీమ్లో ప్లేయర్గా ఉన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరపున 2010, 2011 సీజన్లలో ఐపీఎల్ టైటిల్ గెలిచిన రవిచంద్రన్ అశ్విన్, 2009 సీజన్లలో ప్లేఆఫ్స్కి చేరాడు.

ఏడు సార్లు ఓటమి..
2017లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ ఫైనల్ చేరి, ముంబై ఇండియన్స్ చేతుల్లో ఓడింది.. ఆ సీజన్లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ తరుపున ఆడిన రవిచంద్రన్ అశ్విన్ 2020 సీజన్లో మొట్టమొదటి సారి ఫైనల్ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్లో మెంబర్గా ఉన్నాడు. 2022 సీజన్లో రాజస్థాన్ రాయల్స్లోకి వచ్చిన రవిచంద్రన్ అశ్విన్, టీమ్ని ఫైనల్ చేర్చినా రెండో టైటిల్ అందించలేకపోయాడు. ఓవరాల్గా 15 సీజన్లలో అశ్విన్, రెండు సార్లు టైటిల్ గెలవగా, 7 సార్లు ఫైనల్ మ్యాచుల్లో ఓడి రన్నరప్తో సరిపెట్టుకున్నాడు...

తొలి ప్లేయర్గా..
ఐపీఎల్ 2022 సీజన్లో అశ్విన్ ఆల్రౌండ్ పర్ఫామెన్స్తో అదరగొట్టాడు. మెగా వేలంలో రూ.5 కోట్లకు కొనుగోలు చేసిన రాజస్థాన్ రాయల్స్.. అశ్విన్ను అన్ని విధాలుగా వాడుకుంది. ఐపీఎల్ 2022 సీజన్లో 17 మ్యాచులు ఆడి 7.51 ఎకానమీతో 12 వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్, ఓ హాఫ్ సెంచరీతో 141.48 స్ట్రైయిక్ రేటుతో 191 పరుగులు చేసి రాణించాడు. లక్నోతో జరిగిన మ్యాచ్లో రిటైర్ ఔట్గా పెవిలియన్ చేరి, ఐపీఎల్, టీ20 ఫార్మాట్లోనే ఇలా ఔటైన మొదటి ప్లేయర్గా రికార్డుకెక్కాడు.


Click it and Unblock the Notifications
