
అత్యధిక విజయాలు
రెండో వన్డే గెలిచిన టీమిండియా పలు రికార్డులను తన పేరిట లిఖించుకుంది. వన్డే క్రికెట్ చరిత్రలో ఏ జట్టుకు సాధ్యపడని ఓ అరుదైన ప్రపంచ రికార్డును భారత్ తన ఖాతాలో వేసుకుంది. వన్డే క్రికెట్ చరిత్రలో ఓ ప్రత్యర్ధి (శ్రీలంక)పై అత్యధిక విజయాలు సాధించిన ఏకైక జట్టుగా రికార్డు నెలకొల్పింది. రెండో వన్డే మ్యాచ్లో విజయం అందుకోవడంతో టీమిండియా.. శ్రీలంకపై 93వ విజయాన్ని నమోదు చేసింది.
గతంలో వన్డేల్లో ఏ జట్టు కూడా ఓ ప్రత్యర్ధి ఇన్ని విజయాలు నమోదు చేయలేదు. ఇన్నాళ్లూ న్యూజిలాండ్పై 92 విజయాలతో ఆస్ట్రేలియా టాప్లో ఉంది. భారత్ (శ్రీలంకపై 92 విజయాలు), పాకిస్తాన్ (శ్రీలంకపై 92 విజయాలు) జట్లు కూడా ఆస్ట్రేలియాతో సంయుక్తంగా ఉన్నాయి. ఇప్పడు మాత్రం భారత్ అగ్రస్థానంలో ఉంది.

వరుసగా పదో విజయం
తాజా విజయం ద్వారా టీమిండియా మరిన్ని రికార్డులు తన ఖాతాలో వేసుకుంది. శ్రీలంకపై భారత్కు వరుసగా పదో విజయం కాగా.. వరుసగా తొమ్మిదో సిరీస్ విజయంగా కూడా నిలిచింది. ఆటగాళ్లు కూడా రికార్డులు నెలకొల్పారు. స్టార్ పేసర్ దీపక్ చహర్.. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు దిగి రెండో అత్యధిక పరుగులు (69 నాటౌట్) సాధించిన క్రికెటర్గా రికార్డు సృష్టించాడు.
అతని కంటే ముందు 2019 ప్రపంచకప్ సెమీఫైనల్లో రవీంద్ర జడేజా ఇదే స్థానంలో వచ్చి 77 పరుగులు చేశాడు. అయితే చహర్ టీమిండియాను గెలిపించగా.. జడేజా మాత్రం విజయం ముంగిట పెవిలియన్ చేరాడు.
చాంపియన్ టీమ్లా ఆడారు.. ఓడిపోయినా పోరాటం గొప్పదే!డ్రెస్సింగ్ రూమ్లో ద్రవిడ్ ఎమోషనల్ స్పీచ్!


రెండో అత్యధిక పార్ట్నర్షిప్
సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్తో కలిసి దీపక్ చహర్ నెలకొల్పిన 84 పరుగుల భాగస్వామ్యం.. 8వ వికెట్కు భారత్ తరఫున రెండో అత్యధిక పార్ట్నర్షిప్గా రికార్డుల్లోకి ఎక్కింది. 2017లో ఎంఎస్ ధోనీతో కలిసి భువనేశ్వర్.. శ్రీలంకపైనే 8వ వికెట్కు 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రెండు భాగస్వామ్యంలలో భువీ పాత్ర ఉండడం విశేషం.
తొలి వన్డే ద్వారా భారత జట్టుకి నాయకత్వం వహించిన 25వ కెప్టెన్గా శిఖర్ ధావన్ రికార్డుల్లోకి ఎక్కాడు. దీంతో లేటు వయసులో జట్టు పగ్గాలు అందుకున్న భారత కెప్టెన్గా గబ్బర్ నిలిచాడు. 35 సంవత్సరాల 225వ రోజు ధావన్ టీమియా పగ్గాలు అందుకున్నాడు. దీంతో 1984లో తొలిసారిగా భారత జట్టుకు నాయకత్వం వహించిన మొహిందర్ అమర్నాథ్ రికార్డును బద్దలు కొట్టాడు.


Click it and Unblock the Notifications












