Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India Playing XI: నితీష్ రెడ్డి, కరుణ్ నాయర్ ఔట్.. ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్ ఆడే భారత తుది జట్టు ఇదే!

ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు టీమిండియా సిద్దమైంది. శుక్రవారం(జూన్ 20) లీడ్స్ వేదికగా మొదలయ్యే తొలి టెస్ట్‌తో ఈ సిరీస్‌కు తెరలేవనుంది. ఈ సిరీస్‌తోనే డబ్ల్యూటీసీ 2027 ఎడిషన్ ప్రారంభం కానుంది. టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ఈ సిరీస్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. శుభ్‌మన్ గిల్ సారథ్యంలో టీమిండియా ఈ సిరీస్ ఆడనుంది. కోహ్లీ, రోహిత్ రిటైర్మెంట్ నేపథ్యంలో సాయి సుదర్శన్, కరుణ్ నాయర్, అభిమన్యు ఈశ్వరన్‌లకు అవకాశం దక్కింది. అయితే తొలి టెస్ట్‌లో టీమిండియా కాంబినేషన్ ఎలా ఉంటుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ముఖ్యంగా టెస్ట్‌ క్రికెట్‌క వీడ్కోలు పలికిన రోహిత్, కోహ్లీ స్థానాలను ఎవరు భర్తీ చేస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది.

ఓపెనర్లుగా జైస్వాల్, రాహుల్

తొలి టెస్ట్‌లో యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. అనుభవంతో పాటు స్వింగ్ బాల్స్‌ను సమర్థవంతంగా ఆడగలిగే నైపుణ్యం కలిగిన కేఎల్ రాహుల్‌‌‌ను ఓపెనర్‌గా ఆడించనుంది. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కూడా కలిసిరానుంది. మూడో స్థానంలో సాయి సుదర్శన్, నాలుగో స్థానంలో శుభ్‌మన్ గిల్, ఐదో స్థానంలో కరుణ్ నాయర్ బరిలోకి దిగనున్నారు. అయితే కరుణ్ నాయర్‌కు గాయమైనట్లు వార్తలు వస్తున్నాయి. నెట్స్‌లో ప్రసిధ్ కృష్ణ వేసిన బంతి కరుణ్ నాయర్ పక్కటెముకలకు బలంగా తాకింది. అయితే గాయం తీవ్రత ఎక్కువగా లేదని తెలుస్తున్నా.. ముందస్తు చర్యల్లో భాగంగా పక్కనపెట్టవచ్చనే అభిప్రాయం కలుగుతోంది. ఒకవేళ కరుణ్ నాయర్‌ ఆడకపోతే అతని స్థానంలో అభిమన్యు ఈశ్వరన్ లేదా ధ్రువ్ జురెల్ బరిలోకి దిగవచ్చు. ఎక్స్‌ట్రా స్పిన్నర్ అవసరం అనుకుంటే వాషింగ్టన్ సుందర్‌ను ఆడించవచ్చు.

India Playing XI for 1st Test vs England Nitish Kumar Reddy Out and Karun Nair s Fitness Doubtful

నితీష్ కుమార్ రెడ్డి ఔట్..

వికెట్ కీపర్ రిషభ్ పంత్ 6వ స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. అయితే లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం పంత్‌ను అప్‌ది ఆర్డర్ ఆడించే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. ఏకైక స్పిన్నర్ రవీంద్ర జడేజా ఆడనుండగా.. పేస్ ఆల్‌రౌండర్‌గా శార్దూల్ ఠాకూర్ బరిలోకి దిగనున్నాడు. ఇంట్రా‌స్క్వాడ్ మ్యాచ్‌లో శార్దూల్ ఠాకూర్ మెరుగైన ప్రదర్శన చేశాడు. ఈక్రమంలోనే నితీష్ స్థానంలో శార్దూల్‌ను ఆడించనున్నారు. పేసర్లుగా మహమ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా, ప్రసిధ్ కృష్ణలు ఆడనున్నారు. ఇంగ్లండ్ కండీషన్స్ నేపథ్యంలో టీమిండియా ముగ్గురు పేసర్లు, ఒక స్పిన్నర్‌తో ఆడనుంది. ఓ పేస్ ఆల్‌రౌండర్ నాలుగో బౌలర్‌గా సేవలందించనున్నాడు. ఇక ఇద్దరు స్పిన్నర్లు కావాలనుకుంటే మాత్రం కుల్దీయాదవ్ తుది జట్టులోకి వస్తాడు. అప్పుడు ఓ బ్యాటర్‌పై వేటు పడుతుంది. కానీ కండిషన్స్ నేపథ్యంలో ఒక్క స్పిన్నర్‌తోనే ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

భారత్ తుది జట్టు(అంచనా): యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), కరుణ్ నాయర్/ధ్రువ్ జురెల్, రిషభ్ పంత్(కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా, ప్రసిధ్ కృష్ణ.

ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికైన భారత జట్టు:

శుభ్‌మన్ గిల్(కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రిషభ్ పంత్ (వైస్ కెప్టెన్), ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, ఆకాష్ దీప్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రానా, కుల్దీప్ యాదవ్.

Story first published: Thursday, June 19, 2025, 14:57 [IST]
Other articles published on Jun 19, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+