
ఓటమెరుగని టీమిండియా..
సోమవారం నుంచి ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. 30 ఏళ్ల నుంచి సఫారీ గడ్డపై మ్యాచ్లు ఆడుతున్న టీమిండియా.. వాండరర్స్లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టెస్ట్ మ్యాచ్ ఓడిపోలేదు. ఆ రికార్డును ఇప్పుడు కూడా కొనసాగించాలని కోహ్లీసేన టార్గెట్గా పెట్టుకుంది.
1997లో రాహుల్ ద్రవిడ్ ఫస్ట్ సెంచరీ చేయడం, 2006లో సౌతాఫ్రికా ఫస్ట్ టెస్ట్ విక్టరీ ఈ మైదానంలోనే వచ్చాయి. 2018లో విరాట్ ఓవర్సీస్ టెస్ట్ విక్టరీ కూడా ఈ మైదానం నుంచే మొదలైంది. ఈ క్రమంలోనే అచ్చొచ్చిన మైదానంలో విజయం సాధించి సిరీస్ విజయంతో చరిత్ర సృష్టించాలని కోహ్లీసేన భావిస్తోంది.

పుజారా ఔట్..
ఈ మ్యాచ్కు బ్యాటింగ్ కాంబినేషన్లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ఓపెనర్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ ఫస్ట్ టెస్ట్లో సత్తా చాటడంతో వీరి స్థానాలకు వచ్చిన డోకా ఏం లేదు. కానీ గత కొన్ని రోజులుగా నిలకడలేమి ఫామ్తో ఇబ్బంది పడుతున్న టీమిండియా నయావాల్ చతేశ్వర్ పుజారాకు చోటు దక్కడమే సందేహంగా మారింది.
ఫస్ట్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో గోల్డెన్ డక్గా వెనుదిరిగిన పుజారా.. రెండో ఇన్నింగ్స్లో కూడా తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ క్రమంలోనే అతనికి ఇంకా అవకాశాలు ఇవ్వడం అవసరమా? అనే చర్చమొదలైంది. ఫామ్లో ఉన్న శ్రేయస్ అయ్యర్, హనుమ విహారిలకు చోటివ్వచ్చు కదా? అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పుజారాను పక్కనపెట్టాలనుకుంటే అయ్యర్కు చోటు దక్కవచ్చు. విన్నింగ్ కాంబినేషన్ను మార్చడం ఇష్టం లేకపోతే పుజారాకు చివరి అవకాశం ఇస్తారు. రహానే పరిస్థితి కూడా అదే. ఫస్ట్ ఇన్నింగ్స్లో 48 పర్వాలేదనిపించిన రహానే.. రెండో టెస్ట్లో రాణించడం కీలకం.

అశ్విన్ ప్లేస్లో విహారికి చాన్స్..
వాండరర్స్ పిచ్ స్పిన్నర్లకు పెద్దగా అనుకూలించదు. ఈ దిశగా కోహ్లీ ఆలోచిస్తే.. విహారికి ఫైనల్ ఎలెవన్లో చోటు దక్కొచ్చు. నలుగురు ఫ్రంట్ లైన్ పేసర్లు ఫిట్గా ఉంటే.. అప్పుడు స్పిన్నర్ అవసరం పెద్దగా ఉండదు. ఈ పరిస్థితుల్లో అశ్విన్ను తప్పించి విహారి వైపు మొగ్గుచూపుతారేమో చూడాలి. సెంచూరియన్లో అశ్విన్ రెండు వికెట్లు మాత్రమే తీశాడు.
కానీ జొహన్నెస్బర్గ్కు వచ్చేసరికి స్పిన్నర్ల పాత్ర మరింత తగ్గుతుంది. గుడ్ ఓవర్ రేట్ను మెయింటేన్ చేయాలనుకుంటే విహారితో 8,10 ఓవర్లు వేయించొచ్చు. ఒకవేళ విహారిని తీసుకుంటే ఏడో నంబర్ వరకు భారత్ బ్యాటింగ్ డెప్త్ పెరుగుతుంది. ఇలా చేస్తే శార్దూల్ ఠాకూర్ను కూడా పక్కనపెట్టడానికి అవకాశం ఉంటుంది.

శార్దూల్ ఔట్.. ఉమెశ్ ఇన్
టెస్ట్ మ్యాచ్కు ఇంకా సమయం ఉన్నప్పటికీ వికెట్పై చాలా ఎక్కువగా గడ్డి కనిపిస్తోంది. దీంతో స్వింగ్, సీమ్ బౌలర్లకు చాలా అనుకూలమని సంకేతాలు వస్తున్నాయి. కాబట్టి శార్దూల్ ప్లేస్లో ఉమేశ్ యాదవ్ తుది జట్టులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే శార్దూల్తో పోలిస్తే ఉమేశ్ బౌలింగ్లో ఫుల్ లెంగ్త్తో పాటు పేస్ కూడా ఎక్కువగా ఉంటుంది.
మాములుగా అయితే కోహ్లీ ఆల్రౌండర్లను ఎక్కువగా తీసుకుంటాడు. బౌలింగ్ ఫ్లెక్సిబిలిటీ కోసం ఈ విధంగా చేస్తుంటాడు. అయితే ఇప్పుడు వర్క్లోడ్ను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే స్టార్ పేసర్ బుమ్రా.. యాంకిల్ ఇంజ్యూరితో బాధపడుతున్నాడు. మరోవైపు షమీపై కూడా భారం బాగా పెరిగిపోతున్నది. కాబట్టి ఈ ఇద్దరిలో ఒకరికి రెస్ట్ ఇచ్చి ఉమేశ్ తీసుకున్నా ఆశ్చర్యం లేదు. కానీ బుమ్రా ఫిట్గా ఉంటే మాత్రం కోహ్లీ ఇవన్నీ పట్టించుకోడు.

భారత తుది జట్టు(అంచనా)
కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా/శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), అజింక్యా రహానే, రిషభ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్/హనుమ విహారి, ఉమేశ్ యాదవ్/శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్


Click it and Unblock the Notifications












