For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

World Test Championship: ఆసీస్ తరహాలో ఇంగ్లండ్‌ను చిత్తు చేస్తే భారత్‌‌కు ఫైనల్ బెర్త్!

India favourite to reach World Test Championship Final after Gabba win

న్యూఢిల్లీ: ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ తుది అంకానికి చేరుకుంది. మొత్తం తొమ్మిది జట్లు పాల్గొంటున్న ఈ చాంపియన్ షిప్​లో ఫైనల్​కు చేరేందుకు టాప్ టీమ్స్ పోటీపడుతున్నాయి. తాజాగా ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్​ను 2-1తేడాతో నెగ్గిన టీమిండియా చాంపియన్‌షిప్ పాయింట్స్ పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఈ నాలుగు జట్లకే టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ చేరుకునే అవకాశాలు ఉండగా.. భారత్‌కు పరిస్థితులు మరీ అనుకూలంగా ఉన్నాయి.

ఇంగ్లండ్‌ను చిత్తు చేస్తే..

ఇంగ్లండ్‌ను చిత్తు చేస్తే..

ఆస్ట్రేలియా గబ్బా కోటలను బద్దలుకొట్టి చారిత్రక విజయాన్నందుకున్న టీమిండియా చాంపియన్‌షిప్​లో అగ్రస్థానానికి చేరుకుంది. ప్రస్తుతం 71.67 విజయాల శాతంతో పాటు 430 పాయింట్లను ఖాతాలో వేసుకొని మొదటి ర్యాంకులో కొనసాగుతోంది. మరో 75 పాయింట్లు సాధించి టీమిండియా 505 పాయింట్లకు చేరుకుంటే సౌతాఫ్రికా- ఆస్ట్రేలియా సిరీస్‌తో సంబంధం లేకుండా నేరుగా ఫైనల్​కు అర్హత సాధిస్తుంది. ఆ పాయింట్లు సాధించాలంటే టీమిండియా స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగే నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో (టెస్ట్ చాంపియన్ షిప్‌లో భారత్ చివరి సిరీస్) విజయం సాధించాలి. గెలవడమే కాదు ఇంగ్లండ్​ను 4-0, 3-0, 3-1 లేదా 2-0తో ఓడించాలి.

సౌతాఫ్రికాను ఓడిస్తేనే..

సౌతాఫ్రికాను ఓడిస్తేనే..

సొంతగడ్డపై భారత్​ చేతిలో సిరీస్ కోల్పోయిన ఆస్ట్రేలియా.. సౌతాఫ్రికా సిరీస్​కు ముందు ఒత్తిడిలో పడింది. ప్రస్తుతం ఆసీస్ 69.16 విజయాల శాతంతో 332 పాయింట్లు సాధించి మూడో స్థానంలో ఉంది. ఒకవేళ సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్​ రద్దయి, టీమిండియాపై ఇంగ్లండ్ ఓడితే ఆస్ట్రేలియా మూడో స్థానంతో సరిపెట్టుకుని ఫైనల్స్ నుంచి నిష్క్రమిస్తుంది. ఆస్ట్రేలియా ఫైనల్​కు అర్హత సాధించాలంటే మాత్రం సౌతాఫ్రికాను 3-0 లేదా 2-0 తేడాతో ఓడించాలి.

భారత్‌ను ఓడిస్తేనే..

భారత్‌ను ఓడిస్తేనే..

ప్రస్తుతం ఇంగ్లాండ్ 65.2 విజయాల శాతంతో 352 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఈ జట్టు ఫైనల్స్​కు అర్హత సాధించాలంటే శ్రీలంకతో జరిగే చివరి టెస్టును గెలిచి.. తర్వాత భారత్‌తో సిరీస్​ను కైవసం చేసుకోవాల్సి ఉంటుంది. కానీ స్వదేశంలో భారత్​కు మంచి రికార్డుంది. గత ఎనిమిదేళ్లలో భారత్ సొంత గడ్డపై ఒకే ఒక టెస్టు ఓడిపోయింది.

అలా జరిగితేనే..

అలా జరిగితేనే..

ఇప్పటికే ఐదు సిరీస్​లు పూర్తి చేసుకున్న న్యూజిలాండ్ ప్రస్తుతం 70 విజయాల శాతం, 420 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు 11 మ్యాచ్​లు ఆడిన కివీస్​ ఏడు గెలిచి నాలుగింటిలో ఓడింది. ఒకవేళ ఆస్ట్రేలియా.. సౌతాఫ్రికాపై గెలిచి, టీమిండియా.. ఇంగ్లండ్​ను ఓడిస్తే కివీస్ ఫైనల్స్ నుంచి వైదొలుగుతుంది.

వరుసగా ఐదు, ఆరు, ఏడు స్థానాల్లో ఉన్న సౌతాఫ్రికా, పాకిస్థాన్, శ్రీలంక టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ రేసు నుంచి ఇప్పటికే నిష్క్రమించాయి.

Story first published: Wednesday, January 20, 2021, 17:28 [IST]
Other articles published on Jan 20, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+