
తొలి టీ20కి 70వేల మంది రావొచ్చని
తొలి టీ20 బ్రిస్బేన్లో జరుగుతుండగా రెండో టీ20ని మెల్బోర్న్లో నిర్వహించేందుకు పూనుకున్నారు. ఇక మూడోది సిడ్నీలో నిర్వహించి ముగించనున్నారు. రెండో మ్యాచ్ జరిగే మెల్బోర్న్ క్రికెట్ మైదానం ప్రపంచంలోనే అతిపెద్దది. దాదాపు 70వేల అభిమానులు వస్తారని అంచనా. ఇక బ్రిస్బేన్కు 30 వేలు, సిడ్నీకి 35వేలు మంది ప్రేక్షకులు హాజరవుతారని అంటున్నారు. ఆస్ట్రేలియా, భారత్ క్రికెట్ పోరుకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది.
గిల్క్రిస్ట్తో కెప్టెన్ కోహ్లీ ముచ్చట్లు

స్మిత్, వార్నర్లపై నిషేధం పడటంతో
నాలుగేళ్ల తర్వాత కోహ్లీసేన అక్కడ పర్యటిస్తుండటంతో అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఆస్ట్రేలియాలో గెలవడానికి ఇంతకంటే మంచి తరుణం మరొకటి లేదనేది మాజీలు, విశ్లేషకుల మాట. ప్రస్తుతమున్నంత బలహీనంగా కంగారూ జట్టు గతంలో ఎప్పుడూ లేదు. ఈ ఏడాది ఆరంభంలో బాల్ టాంపరింగ్ ఉదంతం ఆస్ట్రేలియా క్రికెట్ను గట్టి దెబ్బే తీసింది. స్టీవెన్ స్మిత్, డేవిడ్ వార్నర్లపై నిషేధం పడటంతో జట్టు బలహీనపడింది. టాంపరింగ్ వివాదం మొత్తం జట్టుపై తీవ్ర ప్రభావం చూపింది.

భారత్తో జరిగే మ్యాచ్లు అవకాశంగా భావించి
అప్పట్నుంచి ఆసీస్ ఆట దిగజారుతూ వచ్చి.. వరుస పరాభవాలు వెంటాడాయి. ఐతే సొంతగడ్డపై ఆస్ట్రేలియాను అంత తక్కువ అంచనా వేయలేం. తమ గడ్డపై సరైన రికార్డు లేని భారత్ను ఓడించి తిరిగి ఫామ్ అందుకోవాలని ఆ జట్టు చూస్తోంది. వన్డే ప్రపంచకప్కు ముందు తమ జట్టు తిరిగి పుంజుకోవడానికి ఈ సిరీస్నే ఓ అవకాశంగా భావిస్తోంది. సాధారణంగా ఆస్ట్రేలియాలో భారత పర్యటన టెస్టులతోనే మొదలవుతుంది కానీ.. ఈసారి కొంచెం భిన్నం.

బలంగా కనిపిస్తోన్న భారత జట్టు
టీ20 సిరీస్ జరిగిన తర్వాత టెస్టులు ఆడి.. చివరగా వన్డే సిరీస్లో తలపడుతుంది టీమ్ఇండియా. పొట్టి క్రికెట్ పోరు బుధవారమే ఆరంభం కానుంది. టీ20లంటే పిచ్లు, వాతావరణంతో పెద్దగా సంబంధం ఉండదు. పైగా భారత జట్టు కూడా బలంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కోహ్లీసేన ఈ సిరీస్ గెలిచి టెస్టులకు ముందు ఆత్మవిశ్వాసాన్ని సాధిస్తారని యావత్ భారత అభిమానులు ఆశిస్తున్నారు.


Click it and Unblock the Notifications













