For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs WI: అహ్మదాబాద్ చేరుకున్న టీమిండియా! క్వారంటైన్ షురూ!

IND vs WI: India squad arrives in Ahmedabad ahead of ODI series against West Indies

న్యూఢిల్లీ: వెస్టిండీస్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్​ కోసం భారత జట్టు అహ్మదాబాద్​ చేరుకుంది. ఆటగాళ్లందరూ బయో బబుల్‌లోకి ప్రవేశించారని.. జట్టు సభ్యులందరూ మూడు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంటారని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) తెలిపింది. తొడ కండరాల గాయంతో సౌతాఫ్రికా పర్యటనకు దూరమైన రోహిత్ శర్మ ఈ సిరీస్‌తో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. బయోబబుల్ చేరిన హిట్ మ్యాన్.. కెప్టెన్​గా తొలి సిరీస్​ ఆడనున్నాడు.

ఫిబ్రవరి 6 నుంచి..

ఫిబ్రవరి 6 నుంచి..

పేలవ ప్రదర్శనతో జట్టుకు దూరమైన స్పిన్నర్​ కుల్దీప్​ యాదవ్​ తిరిగి జట్టులో చోటు సంపాందించగా.. రవి బిష్ణోయ్​ అరంగేట్రం చేయనున్నాడు. స్వదేశంలో ఇంగ్లండ్‌పై టీ20 సిరీస్ కైవసం చేసుకున్న వెస్టిండీస్ జట్టు.. రెండు రోజుల్లో అహ్మదాబాద్​ చేరుకోనుంది. నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మూడు వన్డేల సిరీస్ జరగనుంది. తొలి వన్డే ఫిబ్రవరి 6న జరగనుండగా.. రెండో వన్డే ఫిబ్రవరి 9న, మూడో వన్డే 11న జరగనుంది. ఫిబ్రవరి 16, 18, 20వ తేదీల్లో జరగనున్న మూడు టీ20ల సిరీస్‌కు కోల్‌కతా ఆతిథ్యం ఇవ్వనుంది.

1000వ వన్డే..

1000వ వన్డే..

టీమిండియా, వెస్టిండీస్​ మధ్య జరగనున్న వన్డే సిరీస్​​ టీమిండియాకు ఎంతో ప్రత్యేకం కానుంది. క్రికెట్ చరిత్రలో అత్యధికంగా 1000 వన్డేలు ఆడిన తొలి జట్టుగా భారత్ నిలువనుంది. తొలి వన్డేతోనే టీమిండియా ఈ ఘనతను అందుకోనుంది. కెప్టెన్‌గా రోహిత్ శర్మ రికార్డుల్లో నిలిచిపోనున్నాడు. గత ఏడాది డిసెంబరులో విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన భారత సెలెక్టర్లు.. రోహిత్ శర్మకి పగ్గాలు అప్పగించిన విషయం తెలిసిందే. రెగ్యులర్ వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మకి అదే ఫస్ట్ మ్యాచ్ కావడం విశేషం.

కోహ్లీకి చాన్స్ మిస్..

కోహ్లీకి చాన్స్ మిస్..

1974లో ఇంగ్లాండ్‌‌పై ఫస్ట్ వన్డే మ్యాచ్‌ను అజిత్ వాడేకర్ కెప్టెన్సీలో ఆడిన భారత్.. ఆ తర్వాత 100వ వన్డే‌ని కపిల్‌దేవ్ కెప్టెన్సీలో ఆడింది. అనంతరం 500 వన్డేకి సౌరవ్ గంగూలీ, 700, 800, 900 వన్డేకి కూడా మహేంద్రసింగ్ ధోనీ కెప్టెన్సీ వహించాడు. కానీ.. విరాట్ కోహ్లీకి అవకాశం దక్కలేదు. ఫిబ్రవరి 6న రోహిత్ శర్మ 1000వ వన్డేకి కెప్టెన్సీ వహించబోతున్నాడు.

క్రికెట్ ప్రపంచంలో ఇప్పటి వరకూ ఏ జట్టు కూడా 1000 వన్డేల మైలురాయిని చేరుకోలేదు. భారత్ 999 వన్డేలు ఆడి నెం.1 స్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా 998 వన్డేలు, పాకిస్థాన్ 936 వన్డేలతో టాప్-3లో కొనసాగుతున్నాయి.

Story first published: Monday, January 31, 2022, 21:45 [IST]
Other articles published on Jan 31, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+