బస్సులో నుంచి దిగి..
మైదానం నుంచి భారత జట్టు హోటల్ గదికి వెళ్తుండగా.. అక్కడికి వచ్చిన ధరమ్ వీర్ పాల్ అనే అభిమానిని చూసిన విరాట్ బస్సులో నుంచి దిగి కానుకను అందజేశాడు. మధ్యప్రదేశ్కు చెందిన ధరమ్వీర్ పాల్ పుట్టుకతోనే పోలియో బారిన పడ్డాడు. క్రికెట్ను ప్రాణంగా భావించే ధరమ్వీర్ టీమిండియా ఆడే ప్రతీ మ్యాచ్కు హాజరవుతుంటాడు. అంగవైకల్యం తనకు ఇష్టమైన క్రికెట్కు ఎన్నడూ అడ్డుపడలేదని.. అందుకే టీమిండియా ఆడే ప్రతీ మ్యాచ్కు ఎంతదూరమైనా వెళ్తుంటానని చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలోనే టీమిండియా ఆటగాళ్లకు ధరమ్ వీర్ పాల్ సుపరిచితుడయ్యాడు.

థ్యాంక్యూ చాంపియన్..
ఇక విరాట్ కోహ్లీ ఇచ్చిన కానుకకు సంబంధించిన వీడియోనూ ధరమ్వీర్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ‘ధన్యవాదాలు చాంపియన్.. నువ్వు ఎప్పటికి నా చాంపియన్వే.. ఇంకా కొన్నేళ్లు నీ ఆట నిరంతరాయంగా సాగాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా'' అని క్యాప్షన్ ఇచ్చాడు. ఇక 2017లో ఇండియన్ ఎక్స్ప్రెస్కు ఇచ్చిన ఇంటర్య్వూలో ధరమ్వీర్ కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
సచిన్ పాజీ, ఎంఎస్ ధోనీ, యువరాజ్ సింగ్, సెహ్వాగ్, కోహ్లీ లాంటి ఆటగాళ్లతో మంచి సంబంధాలున్నాయని తెలిపాడు. ఎన్నోసార్లు తనకు సాయమందించారని, వారికి కృతజ్ఞతుడిగా ఉంటానని తెలిపాడు. ఇక మధ్యప్రదేశ్ దివ్యాంగుల క్రికెట్ జట్టుకు ధరమ్వీర్ పాల్ కెప్టెన్గా వ్యవహరిస్తుండడం గమనార్హం.

జడేజా సూపర్ షో..
శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 222 పరుగుల ఇన్నింగ్స్ తేడాతో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ విరాట్ కోహ్లీకి కెరీర్లో 100వ టెస్ట్ కాగా.. రాక్స్టార్ జడేజా ఆల్రౌండ్ ప్రదర్శనతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక సెంచరీ చేస్తాడని భావించిన విరాట్.. 45 పరుగులతో సరిపెట్టాడు. మ్యాచ్ అసాంతం ఉత్సాహంగా కనిపించిన విరాట్.. అభిమానులను తనదైన శైలిలో అలరించాడు. అల్లుఅర్జున్ పుష్ప సినిమాలోని తగ్గేదేలే డైలాగ్ చెబుతూ అభిమానులను ఉత్సాహపరిచాడు.


Click it and Unblock the Notifications
