
రూ.200 కోట్లు నష్టం..
ఈ సిరీస్తో స్టార్ స్పోర్ట్స్, డిస్నీ హాట్స్టార్ దాదాపు రూ.200 కోట్లకు పైగా నష్టపోయినట్లు బ్రాడ్కాస్టింగ్ వర్గాలు తెలిపాయి. ఈ మ్యాచ్ మధ్యలో అడ్వర్జైజింగ్ ఇచ్చేందుకు కంపెనీలు అన్నీ దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్ మొత్తానికి కేవలం రెండు మూడు బ్రాండ్స్ మాత్రమే ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం.
ఇక భారీ ధరకు బ్రాడ్ కాస్ట్ హక్కులను అందుకున్న స్టార్ నెట్వర్క్.. ఒక్క మ్యాచ్కు రూ.60.1 కోట్లను బీసీసీఐకి చెల్లిస్తుంది. అయితే స్టార్ స్పోర్ట్స్ 30-40 శాతం ఆదాయాన్ని అడ్వర్టైజ్మెంట్స్, సేల్స్, సబ్స్క్రిప్షన్ ద్వారానే ఆర్జిస్తోంది.

ఒక్క అడ్వైజర్ లేడు..
ఈ సిరీస్ పట్ల బడా కంపెనీలు ఆసక్తి కనబర్చటం లేదని చెప్పిన డిస్ని స్టార్ అధికారి ఒకరు.. మొత్తం రూ.200 కోట్లుకు పైగా నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నాడు. 'కొత్త ఏడాది తొలి సిరీస్కు ఏ మాత్రం ఊహించని స్పందన ఎదురైంది. చాలా మంది అడ్వర్టైజర్స్, ఏజన్సీస్ పెట్టు బడి పెట్టేందుకు భయపడుతున్నారు.
ఈ సిరీస్కు ఎదురవుతున్నపరిస్థితులు ఏమాత్రం ఊహించనివి. తొలి టీ20కి హాట్స్టార్లో ఒక్క అడ్వైజర్ లేడు. లైవ్ బ్రాడ్కాస్ట్కు కూడా 15-20 శాతం ఇన్వెంటరీ మాత్రమే అమ్ముడైంది.'అని సదరు అధికారి ఇన్సైడ్ స్పోర్ట్స్కు తెలిపారు. ప్రత్యక్షప్రసారానికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్సే కాదు.. గ్రౌండ్ స్పాన్సర్షిప్ కూడా దారుణంగా పడిపోయింది. ఈ ట్రెండ్ భవిష్యత్తు ద్వైపాక్షి సిరీస్లపై ఉన్న ఆసక్తిని తగ్గిస్తోంది.

కోహ్లీ, రోహిత్ లేకపోవడం..
ప్రస్తుతం మార్కెట్ విపత్క పరిస్థితులు ఎదుర్కొంటుండటం.. బడా కంపెనీలు భవిష్యత్తు తలుచుకొని ఆచితూచి ఖర్చు చేస్తుండటంతో ఈ పరిస్థితి ఏర్పడిందని బిజినెస్ నిపుణులు అంటున్నారు. ఇక క్రికెట్ పట్ల అభిమానులకు ఉన్న ఆసక్తి కూడా తగినట్లు తెలుస్తోంది. అసలు చాలా మంది శ్రీలంకతో టీ20 సిరీస్ను లైట్ తీసుకున్నారు.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు లేకపోవడం ఓ కారణమైతే.. పూర్తిగా యువ ఆటగాళ్లతో కూడిన జట్టు కావడం.. బలహీనమైన ప్రత్యర్థి ఉండటంతో ఈ పరిస్థితికి కారణంగా తెలుస్తోంది. మాములుగా భారత్ మ్యాచ్ జరిగితే హాట్ స్టార్లో కనీసం కోటీ మంది వీక్షించేవారు. కానీ నిన్నటి మ్యాచ్కు ఏ దశలోనూ అభిమానుల సంఖ్య 70 లక్షలు ధాటలేదు.


Click it and Unblock the Notifications












