రాణించిన ఫెర్నాండో..
227 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ మినోద్ భానుక(7)ను కృష్ణప్ప గౌతమ్ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. కానీ క్రీజులోకి వచ్చిన భానుక రాజపక్సతో మరో ఓపెనర్ అవిష్క ఫెర్నాండో ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. ఈ ఇద్దరి ఆచితూచి ఆడుతూ వీలుచిక్కిన బంతిని బౌండరీకి తరలించడంతో పవర్ ప్లే ముగిసేసరికి శ్రీలంక వికెట్ నష్టానికి 55 రన్స్ చేసింది. ఆ తర్వాత మరింత నిలకడగా ఆడిన ఈ జోడీ భారత బౌలర్లపై ఎదురు దాడికి దిగింది. ఈ క్రమంలో తొలుత ఫెర్నాండో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. ఆ తర్వాత రాజపక్స కెరీర్లో తొలి హాఫ్ సెంచరీ అందుకున్నాడు.
ఆడుతూ పాడుతూ..
క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీనీ అరంగేట్ర పేసర్ చేతన్ సకారియా వీడదీసాడు. భానుక రాజపక్సను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ధనుంజయ డిసిల్వాను సైతం సకారియా రిటర్న్ క్యాచ్తో వెనక్కి పంపాడు. క్రీజులోకి చరిత అసలంకా మెరుపులు మెరిపించాడు. అయితే హార్దిక్ పాండ్యా ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. అయితే లక్ష్యం తక్కువగా ఉండటంతో లంక ఆటగాళ్లు ఎలాంటి ఒత్తిడి లేకుండా బ్యాటింగ్ చేశారు.
రాహుల్ చాహర్ చెలరేగినా..?
చివర్లో రాహుల్ చాహర్ డసన్ షనక(0), అవిష్కా ఫెర్నాండో, చమిక కరుణరత్నే(1)లను ఔట్ చేయడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. కానీ చేయాల్సిన పరుగులు తక్కువగా ఉండటంతో శ్రీలంక సునాయస విజయాన్నందుకుంది. చివర్లో రమేశ్ మెండీస్(15 నాటౌట్), అకిలా ధనుంజయ(5 నాటౌట్) మరో తప్పిదం చేయకుండా లాంచనాన్ని పూర్తి చేశారు. మూడు టీ20ల సిరీస్ ముందు ఈ విజయంతో శ్రీలంక జట్టు తమ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంది. ఆదివారం ఇరు జట్ల మధ్య తొలి టీ20 జరగనుంది.