
చెలరేగిన శివమ్ మావి..
163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఆదిలోనే గట్టిషాక్ తగిలింది. ఓపెనర్ పాతుమ్ నిస్సంక(1)ను అరంగేట్ర పేసర్ శివమ్ మావి స్టన్నింగ్ డెలివరీతో క్లీన్ బౌల్డ్ చేశాడు. తన మరుసటి ఓవర్లో క్రీజులోకి వచ్చిన ధనుంజ డిసిల్వా(8)ను క్యాచ్ ఔట్గా బోల్తా కొట్టించాడు. కుశాల్ మెండీస్(28) బౌండరీలు బాదడంతో శ్రీలంక పవర్ ప్లేలో 2 వికెట్లకు 35 పరుగులు చేసింది. పవర్ ప్లే అనంతరం చరిత్ అసలంక(12)ను ఉమ్రాన్ మాలిక్ కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చగా.. మరుసటి ఓవర్లో హర్షల్ పటేల్ జోరు మీదున్న కుశాల్ మెండీస్ ఇన్నింగ్స్కు తెరదించాడు. క్రీజులోకి వచ్చిన భానుక రాజపక్సను హర్షల్ పటేల్ ఔట్ చేయడంతో 68 పరుగులకే లంక 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

మ్యాచ్ టర్నింగ్ పాయింట్..
ఈ పరిస్థితుల్లో వానిందు హసరంగా(21)తో కలిసి కెప్టెన్ డసన్ షనక(45) జట్టును ఆదుకున్నారు. క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని శివమ్ మావి విడదీసాడు. వానిందు హసరంగా(21)ను ఔట్ చేసి 40 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. ఆ వెంటనే డసన్ షనకను ఫాస్టెస్ట్ డెలవరీతో ఉమ్రాన్ మాలిక్ను బోల్తా కొట్టించాడు. దాంతో మ్యాచ్పై భారత్ పట్టు బిగించింది. డసన్ షనక వికెట్ తీసి ఉమ్రాన్ మ్యాచ్ను మలుపు తిప్పాడు.

అక్షర్ పటేల్తో ప్రయోగం..
ఆ తర్వాత మహీశ్ తీక్షణ(1)ను శివమ్ మావి ఔట్ చేయగా.. చమిక కరుణరత్నే(14) సిక్సర్తో మ్యాచ్ను ఆసక్తికరంగా మార్చాడు. లంక విజయానికి చివరి ఓవర్లో 13 పరుగులు అవసరమవ్వగా.. హార్దిక్ ఆఖరి ఓవర్ను అక్షర్ పటేల్కు ఇచ్చాడు. అయితే అక్షర్ వేసిన మూడో బంతిని కరుణరత్నే సిక్సర్ బాదాడు. దాంతో భారత శిభిరంలో కంగారు మొదలైంది. కానీ చివరి మూడు బంతులను కట్టడిగా వేసిన అక్షర్ పటేల్.. విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.


Click it and Unblock the Notifications
