
మూడేళ్ల నిరీక్షణకు తెరపడేనా?
ఇక డే/నైట్ టెస్టుల్లో భారత్ తరఫున విరాట్ కోహ్లీ ఒక్కడే సెంచరీ చేశాడు. అది కూడా 2019లో కోల్కతా వేదికగా నవంబర్లో బంగ్లాదేశ్తో జరిగిన తొలి పింక్ బాల్ టెస్టులోనే శతకం సాధించాడు. అయితే కోహ్లీకి అదే చివరి సెంచరీ కావడం గమనార్హం. అప్పటి నుంచి ఇప్పటి వరకు మరో సెంచరీ బాదలేదు. టెస్ట్ల్లోనే కాదు ఇతర ఫార్మాట్లలోనూ అతను శతకం సాధించలేకపోయాడు. ఇక ఇటీవల మొహాలి వేదికగా జరిగిన తొలి టెస్టులోనూ 45 పరుగులతో ఆకట్టుకున్నా.. చివరికి హాఫ్ సెంచరీ ముందు ఔటయ్యాడు. దీంతో వందో టెస్టులోనైనా శతకం సాధిస్తాడని ఆశించిన అభిమానులకు నిరాశే మిగిలింది. అయితే, శనివారం నుంచి లంకతో ప్రారంభమయ్యే రెండో టెస్టులోనైనా విరాట్ సెంచరీ చేస్తాడా? అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

మరో 25 రన్స్ చేస్తే..
ఇక ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ మరో 25 పరుగులు సాధిస్తే టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మార్క్వా, గ్యారీ సోబర్స్లను వెనక్కినెడుతాడు. ప్రస్తుతం 8007 రన్స్తో కోహ్లీ ఉండగా.. మార్క్వా(8029), గ్యారీ సోబర్స్(8032) అతనికన్నా ముందున్నారు. ఇక రోహిత్ శర్మ గతేడాది అహ్మదాబాద్లో ఇంగ్లండ్తో జరిగిన పింక్బాల్ టెస్టులో 66 పరుగులతో రాణించాడు. అతను కూడా ఈ లంకతో జరిగే రెండో మ్యాచ్లో బ్యాట్ ఝుళిపిస్తే భారీ పరుగులు చేసే అవకాశం ఉంది. దీంతో పింక్బాల్ టెస్టుల్లో కోహ్లీని అధిగమించి అత్యధిక పరుగులు చేసే వీలుంది. అతడి అభిమానులు సైతం ఇదే ఆశిస్తున్నారు.

అశ్విన్ను ఊరిస్తున్న రికార్డు..
మరోవైపు బౌలింగ్ విభాగంలో రవిచంద్రన్ అశ్విన్ ఒకే ఇన్నింగ్స్లో ఐదు వికెట్ల ప్రదర్శన చేస్తే స్పిన్ దిగ్గజం అనిల్కుంబ్లేకు చెందిన ఓ అరుదైన రికార్డును సమం చేస్తాడు. గత మ్యాచ్లో అతడు టీమ్ఇండియా తరఫున అత్యధిక టెస్టు వికెట్లు సాధించిన జాబితాలో కపిల్ దేవ్ (434)ను అధిగమించి రెండో స్థానానికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాబోయే మ్యాచ్లోనూ మరోసారి బంతితో మాయ చేస్తే భారత్లో అత్యధికసార్లు ఐదు వికెట్లు సాధించిన కుంబ్లే (25) సరసన నిలుస్తాడు. అదే రెండు ఇన్నింగ్స్ల్లో ఐదు వికెట్ల ప్రదర్శన చేస్తే కుంబ్లేనే అధిగమించి కొత్త చరిత్ర సృష్టిస్తాడు.


Click it and Unblock the Notifications
