
ద్రవిడ్ సక్సెస్
శ్రీలంక పర్యటనలో రాహుల్ ద్రవిడ్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. పటిష్ట శ్రీలంకతో యువ భారత్ చేసిన పోరాటం అందరిని ఆశ్చర్యపరిచింది. ఇందుకు కారణం ద్రవిడ్. యువకులకు అండగా ఉంటూ.. వారికి ఎంతో స్ఫూర్తినిచ్చాడు. సరైన సమయంలో సూచనలు, సలహాలు ఇస్తూ జట్టును తనదైన శైలిలో ముందుకునడిపించాడు.
మరోవైపు టీమిండియా ప్రధాన హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా విజయవంతం అయ్యాడు. అయితే అతని పదవీకాలం ఈ ఏడాది చివర్లో జరగనున్న టీ20 ప్రపంచకప్తో ముగియనుంది. దీంతో అతని స్థానంలో ద్రవిడ్ వస్తాడని అందరూ అంచనా వేస్తున్నారు. ఇదే విషయాన్ని ద్రవిడ్ను అడగ్గా.. ఇప్పుడే అంతదూరం ఆలోచించలేదు అని చెప్పాడు.

అంతదూరం ఆలోచించలేదు
శ్రీలంకతో టీ20 సిరీస్ అనంతరం రాహుల్ ద్రవిడ్ స్పోర్ట్స్కీడాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా టీమిండియా ఫుల్ టైమ్ కోచింగ్పై మీ అభిప్రాయం ఏంటని అడగ్గా.. 'లంక పర్యటనను ఆస్వాదించాను. ఈ అనుభవం బాగుంది. నిజాయితీగా చెప్పాలంటే.. ఫుల్ టైమ్ కోచింగ్పై ఇంకా ఆలోచించలేదు. నాకు అసలు ఆ ఆలోచనే రాలేదు.
ఇప్పుడు నేను చేస్తున్న పనితో సంతోషంగా ఉన్నా. ఈ టూర్ని ఆస్వాదించడం తప్ప.. మరే ఆలోచనలు చెయ్యట్లేదు. ఈ కుర్రాళ్లతో పనిచేయడం చాలా ఇష్టం. ఇది చాలా బాగుంది. మీకు ఓ విషయం చెప్పాలి.. ఫుల్ టైమ్ కోచింగ్ అంటే ఎన్నో సవాళ్లు ఉంటాయి. అవన్నీ నాకు తెలియదు' అని ద్రవిడ్ అన్నాడు.
IND vs SL:భారత జట్టులో మరోసారి కరోనా కలకలం..ఇద్దరు ఆటగాళ్లకు పాజిటివ్!ఆందోళనలో బీసీసీఐ!!

కోచ్గా పనిచేయడం ఇది రెండోసారి
రాహుల్ ద్రవిడ్ టీమిండియాకు కోచ్గా పనిచేయడం ఇది రెండోసారి. 2014లో ఇంగ్లండ్తో జరిగిన పర్యటనలో బ్యాటింగ్ కన్సల్టెంట్గా జట్టుతో పాటు వెళ్లాడు. 2018 లో పృథ్వీ షా నాయకత్వంలో భారత అండర్ 19 జట్టు న్యూజిలాండ్లో జరిగిన ప్రపంచ కప్ను గెలుచుకుంది. అప్పుడు జట్టు కెప్టెన్ రాహుల్ ద్రవిడ్. చాలా సంవత్సరాలుగా యువ క్రికెటర్లు ద్రవిడ్ పనిని, అతని పద్ధతులను ప్రశంసిస్తున్నారు. 2019లో అతను జాతీయ క్రికెట్ అకాడమీకి ప్రధాన కోచ్గా కూడా నియామకం అయ్యాడు. అప్పటినుంచి ఎందరో కుర్రాళ్లు భారత జట్టులోకి ఎంపికవుతున్నారు.

గతంలో విదేశీ కోచ్లనే నమ్ముకున్నా
టీమిండియా హెడ్ కోచ్ పదవి అత్యంత విలువైనది. చాలా కాలం పాటు బీసీసీఐ విదేశీ కోచ్లనే నమ్ముకున్నా.. ఆ తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. భారత మాజీలు అనిల్ కుంబ్లే, రవిశాస్త్రిలు హెడ్ కోచ్లుగా నియమితులయ్యారు. వారి కాలంలో టీమిండియా అద్భుతమైన విజయాలు సాధించింది. ముఖ్యంగా రవిశాస్త్రి హెడ్కోచ్ అయిన తర్వాత రెండుసార్లు ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలోనే ఓడించింది కోహ్లీసేన.. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు కూడా చేరింది. అయితే అతని పదవీకాలం ఈ ఏడాది చివర్లో జరగనున్న టీ20 ప్రపంచకప్తో ముగియనుంది. దీంతో అతని తర్వాత ఎవరు అన్న చర్చ ప్రారంభమైంది.


Click it and Unblock the Notifications












