
శుభారంభం లేదు..
165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ మినోద్ భానుక(10) కృనాల్ పాండ్యా బౌలింగ్లో క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ అవిష్కా ఫెర్నాండో ఆడపా దడపా బౌండరీలు బాదడంతో శ్రీలంక పవర్ ప్లే ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 46 రన్స్ చేసింది. పవర్ ప్లే ముగిసిన వెంటనే కెప్టెన్ శిఖర్ ధావన్ యుజ్వేంద్ర చాహల్ను బరిలోకి దింపి ఫలితం రాబట్టాడు. తన తొలి ఓవర్ రెండో బంతికే ధనుంజయ డిసిల్వా(9)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. భువనేశ్వర్ కుమార్ వేసిన ఆ మరుసటి ఓవర్లోనే అవిష్కా ఫెర్నాండో(26) శాంసన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

అసలంక మెరుపులు..
ఇక క్రీజులోకి వచ్చిన చరిత్ అసలంక భారత బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో భారీ సిక్సర్ బాదిన అసలంక చాహల్ ఓవర్లో బౌండరీ సాధించాడు. మిస్టర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీ వేసిన 12వ ఓవర్లో మరో భారీ సిక్సర్ బాదిన అసలంక..తన మరుసటి ఓవర్లో సిక్స్, ఫోర్తో 14 రన్స్ పిండుకున్నాడు. హాఫ్ సెంచరీకి చేరువవుతూ.. ప్రమాదకరంగా మారిన అసలంకను దీపక్ చాహర్ పెవిలియన్ చేర్చాడు. అతను వేసిన 16వ ఓవర్లో భారీ షాట్కు ప్రయత్నించిన అసలంక డీప్ మిడ్వికెట్లో పృథ్వీ షాకు చిక్కాడు. అదే ఓవర్లో హసరంగా కూడా ఔటవ్వడంతో మ్యాచ్ భారత్ వైపు తిరిగింది.

చెలరేగిన భువీ..
భువీ బౌలింగ్లో కెప్టెన్ డసన్ షనక భారీ సిక్సర్తో ఆందోళన పెట్టినా.. మరో ఎండ్లోని కరుణరత్నేను భువీ క్లీన్ బౌల్డ్ ఔట్ చేశాడు. వరుణ్ చక్రవర్తీ బౌలింగ్లో డసన్ షనక స్టంపౌటవ్వడంతో శ్రీలంక ఆశలు సన్నగిల్లాయి. చివరి రెండు ఓవర్లలో శ్రీలంక విజయానికి 40 పరుగులు అవసరమవ్వగా.. 19వ ఓవర్ వేసిన భువీ తొలి మూడు బంతుల్లోనే ఇసురు ఉడానా(1), చమీరా(1)లను పెవిలియన్ చేర్చాడంతో భారత విజయం లాంఛనమైంది.


Click it and Unblock the Notifications