For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SL: ఓయ్ రణతుంగా గబ్బర్ సేన దెబ్బ చూశావా? ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే! నెట్టింట పేలుతున్న సెటైర్స్!

Ind vs Sl: Arjuna Ranatunga Gets Brutally Trolled By Indian Fans After 1st ODI
Ind Vs SL 1st odi : Netizens Slams Arjuna Ranatunga | Oneindia Telugu

హైదరాబాద్: 'భారత ద్వితీయ శ్రేణి జట్టుతో సిరీస్‌కు ఒప్పుకోవడం శ్రీలంకకు అవమానం'అన్న ఆ దేశ మాజీ కెప్టెన్ అర్జున రణతుంగకు శిఖర్ ధావన్ నేతృత్వంలోని భారత్ జట్టు తమ ఆటతోనే ధీటుగా బదులిచ్చింది. తొలి వన్డేలో శ్రీలంకను 7 వికెట్లతో చిత్తు చేసి సిరీస్‌ను, టూర్‌ను గ్రాండ్‌గా ఆరంభించింది. బర్త్ డే బాయ్ ఇషాన్ కిషన్(42 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 59) వన్డే కెరీర్‌ను కూడా హాఫ్ సెంచరీతో మొదలుపెట్టగా... మరో యువ కెరటం పృథ్వీషా(24 బంతుల్లో 9 ఫోర్లతో 43) మెరుపులు మెరిపించాడు.

ఈ ఇద్దరికీ కెప్టెన్ శిఖర్ ధావన్(95 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్‌తో 86 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్‌ తోడవడంతో భారత్ సునాయసంగా గెలుపొందింది. దాంతో అర్జున్ రణతుంగపై భారత అభిమానులు ట్విటర్ వేదికగా సెటైర్లు పేల్చుతున్నారు.

ఎక్కడ దాక్కున్నావ్..?

ఫన్నీ మీమ్స్, సరదా ట్వీట్స్‌తో నవ్వులు పూయిస్తున్నారు. రణతుంగా సెకండ్ స్ట్రింగ్ టీమ్ కామెంట్స్ ప్రస్తావిస్తూ సెటైర్లు పేల్చుతున్నారు. ద్వితీయ శ్రేణి జట్టే మీ అసలు సిసలు జట్టును చిత్తుగా ఓడించిందని ఒకరంటే.. ఈ మ్యాచ్ ఫలితం చూసాక రణతుంగా దుప్పటి కప్పుకొని పడుకోవచ్చనే ఫన్నీమీమ్ మరో నెటిజన్ షేర్ చేశాడు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని, ముందుందు అసలు పండగని హెచ్చరిస్తున్నారు. ఇంకొంతమంది ఇరు జట్ల స్కోర్ కార్డ్స్ షేర్ చేస్తూ.. ఇప్పుడేమంటావ్ రణతుంగా? అని నిలదీస్తున్నారు. ఈ ఫలితంపై స్పందించే ధైర్యం ఉందా? రణతుంగా? అని మరొకరు ప్రశ్నిస్తున్నారు.

కోహ్లీసేననే ఓడించగలదు..

ఇక గబ్బర్ సేన ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న కోహ్లీసేనను కూడా ఓడించగలదని టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చేసిన కామెంట్స్‌ను కూడా షేర్ చేస్తున్నారు. ''అర్జున రణతుంగ ఈ టీమ్‌ని బి టీమ్ అన్నాడు. మేము ఆ అభిప్రాయంతో ఏకీభవించం. నువ్వు ఈ టీమ్‌ని బి టీమ్ అనుకోవచ్చు. కానీ.. భారత్ ఏ టీమ్‌ని పంపినా అది బి టీమ్ కాదు. ఎందుకంటే.. ఐపీఎల్‌ ద్వారా చాలా మంది ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారు. వారిని కేవలం ఒక టీమ్‌కి ఇప్పుడు పరిమితం చేయలేం. ఇంకా చెప్పాలంటే.. ఇప్పుడు శ్రీలంకలో ఉన్న భారత జట్టు.. ఇంగ్లండ్ టూర్‌లోని కోహ్లీ సేనని కూడా కొన్ని మ్యాచ్‌ల్లో ఓడించగలదు''అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.

ఇది శ్రీలంక Z టీమ్..?

గబ్బర్ సేన బీ టీమ్ అయితే.. చిత్తుగా ఓడిన శ్రీలంకది Z టీమ్? అని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. భారత దేశవాళీ క్రికెట్‌లోని రంజీ టీమ్‌తో కూడా ప్రస్తుత శ్రీలంక టీమ్ ఓడిపోతుందని రణతుంగకు మరో అభిమాని చురకలంటించాడు. ఈ అనవసర మాటలు మాట్లాడటం ఆపేసి దేశ క్రికెట్‌ను ఎలా అభివృద్ది చేయాలో చూడాలని హితవు పలుకుతున్నారు. భారత్‌లా బెంచ్ బలం పెంచుకోవాలని, దేశవాళీ క్రికెట్‌ను పటిష్టం చేసుకోవాలని సూచిస్తున్నారు. మొత్తానికి గబ్బర్ సేన విజయం.. రణతుంగ తలమీదకు వచ్చింది.

ఆడుతూ పాడుతూ..

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్లకు 262 పరుగులు చేసింది. చమిక కరుణరత్నే (35 బంతుల్లో 43 నాటౌట్‌; 1 ఫోర్, 2 సిక్స్‌లు), కెప్టెన్‌ దసున్‌ షనక (50 బంతుల్లో 39; 2 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. భారత బౌలర్లలో దీపక్ చాహర్, కుల్దీప్, చాహల్ రెండేసి వికెట్లు తీశారు. లక్ష్యఛేదనలో భారత్‌ 36.4 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 263 పరుగులు చేసి గెలుపొందింది. కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ అజేయ అర్ధ సెంచరీతో చివరి వరకు క్రీజులో ఉండి జట్టుకు విజయాన్ని అందించాడు. సూర్యకుమార్ యాదవ్ సైతం పర్వాలేదనిపించాడు.

Story first published: Monday, July 19, 2021, 14:03 [IST]
Other articles published on Jul 19, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+