
చిట్టీతో పరిగెత్తిన సందీప్
విషయంలోకి వెళితే... ఛేదనలో శ్రీలంక ఇన్నింగ్స్ 18వ ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. ఇదే సమయంలో మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో అంపైర్లు బెయిల్స్ తీసి మ్యాచ్ను కాసేపు నిలిపివేశారు. గ్రౌండ్మెన్లు కూడా పిచ్పై కవర్ కప్పేందుకు సిద్ధమయ్యారు. ఈ సమయంలో టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ సూచనలు చేసిన ఒక చిట్టీని 12వ ఆటగాడైన సందీప్ వారియర్ చేతిలో పెట్టాడు. సందీప్ ఆ చిట్టీని తీసుకొని మైదానంలోకి పరుగెత్తాడు. కెప్టెన్ శిఖర్ ధావన్కు ఆ చిట్టి ఇచ్చి బయటకు వచ్చేశాడు.
Tokyo Olympics 2021: ప్రపంచ రికార్డు నెలకొల్పిన చైనా అమ్మాయిలు.. 1996 తర్వాత ఇదే తొలిసారి!!

పరుగులు ఎక్కువగా ఇవొద్దు
ఆ చిట్టీలో కోచ్ రాహుల్ ద్రవిడ్ ఏం పంపాడనేది ఆసక్తి కలిగించింది. నిజానికి ఆ చిట్టీలో డక్వర్త్ లూయిస్ గురించి రాసినట్లు సమాచారం. వర్షం అంతరాయం కలిగించడంతో డక్వర్త్ లూయిస్ ప్రకారం మ్యాచ్ జరిగే అవకాశముందని భావించిన ద్రవిడ్.. దానికి తగ్గ ప్రణాళికలు చిట్టీలో రాసి పంపించినట్లు తెలిసింది. పరుగులు ఎక్కువగా ఇవొద్దు.. అప్పుడే మనం గెలిచే అవకాశాలు ఉంటాయని ఆ చిట్టీలో ద్రవిడ్ రాసివుండొచ్చు అని సమాచారం. అయితే కాసేపటికే వర్షం ఆగిపోవడంతో.. అంపైర్లు మ్యాచ్ను కొనసాగించారు. లంక లక్ష్యాన్ని చివరి ఓవర్లో చేధించి విజయాన్ని అందుకుంది. దాంతో ద్రవిడ్ పంపిన సందేశం టీమిండియాకు ఉపయోగపడకుండా పోయింది.

శ్రీలంక విజయం
ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 132 పరుగులు చేసింది. కెప్టెన్ శిఖర్ ధావన్ (42 బంతుల్లో 40; 5 ఫోర్లు).. అరంగేట్రం ప్లేయర్స్ దేవ్దత్ పడిక్కల్ (23 బంతుల్లో 29; 1 ఫోర్, 1 సిక్స్), రుతురాజ్ గైక్వాడ్ (18 బంతుల్లో 21; 1 ఫోర్) ఫర్వాలేదనిపించారు. అకిల ధనంజయ రెండు వికెట్లు పడగొట్టాడు. లక్ష్య ఛేదనలో శ్రీలంక 19.4 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసి గెలుపొందింది. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' ధనంజయ డిసిల్వా (34 బంతుల్లో 40 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్), చమిక కరుణరత్నే (6 బంతుల్లో 12 నాటౌట్; 1 సిక్స్) తమ జట్టుకు విజయాన్ని అందించారు. భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీశాడు.


Click it and Unblock the Notifications












