కెప్టెన్గా విఫలం..
ఈ సిరీస్తో టీ20ల్లో తొలిసారి భారత జట్టును నడిపిస్తున్న రిషభ్ పంత్ అటు బ్యాటర్గా ఇటు కెప్టెన్గా దారుణంగా విఫలమవుతున్నాడు. ఈ సిరీస్కు రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరంగా ఉండగా.. కేఎల్ రాహుల్ను సారథిగా ఎంపిక చేశారు. అనూహ్యపరిస్థితుల్లో చివరి నిమిషంలో అతను గాయంతో సిరీస్ మొత్తానికి దూరమవడంతో రిషభ్ పంత్ తాత్కలిక సారథి జట్టును నడిపిస్తున్నాడు. అయితే కెప్టెన్గా తన మార్క్ పెర్ఫామెన్స్ను చూపించలేకపోతున్నాడు. దాంతో పంత్పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
స్చేచ్చగా నిర్ణయాల్లేవ్..
మైదానంలో స్వేచ్చగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్న పంత్.. అనవసర తప్పిదాలతో భారత విజయవకాశాలను దెబ్బతీస్తున్నాడు. ముఖ్యంగా పరిస్థితులకు తగ్గట్లు బౌలింగ్ మార్పులు చేయలేక సతమతమవుతున్నాడు. తొలి టీ20లో యుజ్వేంద్ర చాహల్తో నాలుగు ఓవర్లు కూడా వేయించలేక తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. రెండో టీ20లోనూ పవర్ ప్లేలోనే బంతినిచ్చి మూల్యం చెల్లించుకున్నాడు. జట్టు క్లిష్ట స్థితిలో ఉన్నప్పుడు క్రీజులో ఉన్న ఏ కెప్టెన్ అయినా బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడేందుకు ప్రాధాన్యత ఇస్తారు. కానీ పంత్ మాత్రం నిర్లక్ష్యపు షాట్తో వెనుదిరిగాడు.
సహచర ఆటగాళ్ల జోక్యం..
రిషభ్ పంత్ ఫీల్డింగ్ సెట్ కూడా తన ఆలోచన మేరకు జరుగుతుందా అనేది డౌటే. ఐపీఎల్లో కెప్టెన్సీ సేవలందించిన ప్లేయర్లు తమ అనుభవాన్ని ఇండియా జట్టులో చూపించాలని బాగా తహతహలాడుతున్నట్లు కన్పిస్తుంది. ఫీల్డింగ్ సెట్ విధానంలో మిగతా వాళ్ల ప్రమేయం ఫీల్డ్లో ఎక్కువైనట్లు కన్పిస్తోంది. ఇక వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అజమాయిషీ కాస్త ఎక్కువ ఉన్నట్లు కన్పిస్తోంది. ఈ క్రమంలోనే పంత్పై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
గబ్బు పట్టిస్తున్నారు కదా..?
గత కొంత కాలంగా రిషభ్ పంత్ విఫలమవుతున్నా అతనికి అంత ప్రాధానత్య ఇవ్వడానికి ప్రధాన కారణం గబ్బా ఇన్నింగ్సేనని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో గబ్బా ఇన్నింగ్స్తో పంత్ చారిత్మాత్మక విజయాన్నందించాడు. ఇక ఇన్నింగ్స్ను ఉద్దేశించి అభిమానులు ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. గబ్బా ఇన్నింగ్స్తో కెప్టెన్ చేస్తే గబ్బు పట్టిస్తున్నాడు కదా? అని సెటైర్లు పేల్చుతున్నారు. సౌతాఫ్రికా నాలుగో వికెట్ తీయడం మిస్టరీగా మారిందంటున్నారు.


Click it and Unblock the Notifications
