
అసలేం జరిగిందంటే..?
అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగిన వాన్డెర్ డసెన్ 29 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఇచ్చిన లాలిపాప్ క్యాచ్ను శ్రేయస్ అయ్యర్ నేలపాలు చేశాడు.
ఇన్నింగ్స్ 16వ ఓవర్లో అవేష్ ఖాన్ బౌలింగ్లో డసెన్ మిడ్ వికెట్ దిశగా సిక్స్ కోసం ప్రయత్నించాడు. కానీ.. బౌండరీ లైన్ వద్ద శ్రేయస్ అయ్యర్ చేతుల్లోకి నేరుగా బంతి వెళ్లింది. కానీ.. తత్తరపాటుకు గురైన శ్రేయస్ అయ్యర్ బంతిని జారవిడిచాడు. ఈ లైఫ్తో చెలరేగిన డసెన్ భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఆ క్యాచ్ శ్రేయస్ పట్టుంటే.. నాలుగో వికెట్కు 64 బంతుల్లో నమోదైన 131 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడేది. అప్పుడు భారత్కు విజయవకాశాలు ఉండేవి.

ఆ తప్పిదమే కలిసొచ్చింది...
శ్రేయస్ అయ్యర్ తన క్యాచ్ను వదిలేయడం సౌతాఫ్రికాకు కలిసొచ్చిందని డసెన్ తెలిపాడు. 'ఈ మ్యాచ్లో నా క్యాచ్ జారవిడచమే కీలకంగా మారింది. భారత్ జట్టు ఆ తప్పిదానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని నాకు తెలుసు. పిచ్ బ్యాటింగ్కి బాగా అనువుగా అనిపించింది. అందుకే.. తొందరపడకుండా క్రీజులో కుదురుకునేందుకు కాస్త సమయం తీసుకున్నాను'' అని మ్యాచ్ అనంతరం డసెన్ చెప్పుకొచ్చాడు.

సఫారీ శుభారంభం..
మొదట భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 211 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (48 బంతుల్లో 76; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగగా... హార్దిక్ పాండ్యా (12 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్లు), కెప్టెన్ రిషభ్ పంత్ (16 బంతుల్లో 29; 2 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు.
అనంతరం దక్షిణాఫ్రికా 19.1 ఓవర్లలో 3 వికెట్లే కోల్పోయి 212 పరుగులు చేసి గెలిచింది. వాన్డెర్ డసెన్ (46 బంతుల్లో 75 నాటౌట్; 7 ఫోర్లు, 5 సిక్సర్లు), 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' డేవిడ్ మిల్లర్ (31 బంతుల్లో 64 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) నాలుగో వికెట్కు 64 బంతుల్లోనే 131 పరుగులు జోడించి సిరీస్లో సఫారీకి శుభారంభం అందించారు.


Click it and Unblock the Notifications












