
ఇక టాస్ గెలిచిన విరాట్ కోహ్లీ పిచ్పై గడ్డి ఉందని, పేస్కు అనుకూలిస్తుందనే విషయం స్పష్టంగా అర్థమవుతుందన్నాడు. భారీ స్కోర్ చేస్తే టీమ్కు కలిసివస్తుందని, భారీ స్కోర్ చేసి ఆ తర్వాత తమ బౌలర్ల స్కిల్స్ను వాడుకోవాలన్నాడు. అందుకే బ్యాటింగ్ తీసుకున్నానని చెప్పాడు. ఇక నా వెన్ను నొప్పి మూడు రోజులే ఉందని, ఇప్పుడు బాగానే ఉందన్నాడు. సరిగ్గా గత మ్యాచ్ ప్రారంభానికి ముందే ఈ నొప్పి మొదలైందన్నాడు. విహారి స్థానంలో తాను బరిలోకి దిగుతున్నానని తెలిపిన విరాట్.. గాయం కారణంగా సిరాజ్ దూరమయ్యాడని చెప్పాడు. అతని స్థానంలో ఉమేశ్ యాదవ్ జట్టులోకి వచ్చాడని చెప్పాడు. ఇషాంత్, ఉమేశ్లో ఎవరా? అనేది తేల్చుకోవడం చాలా కష్టమైందన్నాడు. ఉమేశ్ అద్భుతమైన బౌలర్. మాకు గొప్ప బెంచ్ బలం ఉందన్నాడు.
ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది. ఇక తాము కూడా బ్యాటింగే తీసుకోవాలనుకున్నామని సౌతాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ అన్నాడు. తొలుత బౌలింగ్ చేయడానికి పరిస్థితులు అనుకూలంగా లేవన్నాడు. కీలక ఆటగాళ్లు దూరమైనా.. యువ ఆటగాళ్లు సత్తా చాటుతున్నారని చెప్పుకొచ్చాడు. విన్నింగ్ కాంబినేషన్ను మార్చకుండా ఈ మ్యాచ్ బరిలోకి దిగుతున్నామని ఎల్గర్ స్పష్టం చేశాడు.
మూడు టెస్ట్ల సిరీస్లో ఇరు జట్లు చెరొక విజయాన్నందుకోవడంతో 1-1తో సిరీస్ సమమై ఈ మ్యాచ్ కీలకమైంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టునే సిరీస్ వరించనుంది. ఇక మూడు దశాబ్దాలుగా అందని ద్రాక్షగా ఉన్న ఈ టెస్ట్ సిరీస్ విజయాన్నందుకోవాలని టీమిండియా భావిస్తోంది.
తుది జట్లు
భారత్: కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, రిషభ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్
సౌతాఫ్రికా: డీన్ ఎల్గర్(కెప్టెన్), ఎయిడెన్ మార్క్రమ్, కీగన్ పీటర్సన్, డస్సెన్, టెంబా బవుమా, కైల్ వెర్రెన్, మార్కో జాన్సెన్, కగిసో రబడా, కేశవ్ మహరాజ్, ఓలివర్, లుంగి ఎంగిడి