
1992-93లో ఫస్ట్ టెస్ట్..
ఇప్పటివరకు కేప్టౌన్ మైదానంలో భారత్ ఐదు టెస్టు మ్యాచ్లు ఆడగా.. ఇందులో రెండు డ్రాగా ముగియగా.. మూడు మ్యాచ్ల్లో ఓటమిపాలైంది. 1992-93లో కేప్టౌన్ వేదికగా ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగ్గా.. డ్రాగా ముగిసింది. ఆ పర్యటనలో నాలుగో టెస్ట్ ఈ మైదానం వేదికగా జరగా.. ఈ సిరీస్ను సౌతాఫ్రికా 1-0తో కైవసం చేసుకుంది.
1997లో జరిగిన మూడు టెస్టు మ్యాచ్ల సిరీస్లో రెండో టెస్టు కేప్టౌన్ వేదికగా జరిగింది. అప్పటికే మొదటి టెస్టును 328 పరుగుల తేడాతో గెలుచుకుని జోరుమీదున్న సఫారీసేన.. రెండో టెస్టులోనూ ఘనవిజయం సాధించింది. 282 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్లో సచిన్, అజారుద్దీన్ నెలకొల్పిన 222 పరుగుల భాగస్వామ్యం అందరినీ ఆకట్టుకుంది. టెండూల్కర్ 169 పరుగులతో సత్తాచాటగా, అజారుద్దీన్ 115 పరుగులు సాధించాడు.

తొలి విజయం సాధించిన..
2006-07 పర్యటనలో తొలి మ్యాచ్ గెలిచిన టీమిండియా.. సౌతాఫ్రికా గడ్డపై తొలిసారి ఓ టెస్టు మ్యాచ్ విజయం సాధించింది. కానీ ఆ తర్వాత బలంగా పుంజుకున్న సౌతాఫ్రికా.. డర్బన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో విజయంతో సిరీస్ను సమం చేసింది. ఇక చివరిదైన మూడో టెస్టు కేప్టౌన్ వేదికగా జరగగా.. ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా 5 వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్ కైవసం చేసుకుంది. ఈ టెస్టులో సెంచరీ బాదిన వసీం జాఫర్.. సౌతాఫ్రికా గడ్డపై శతకం చేసిన తొలి భారత ఓపెనర్గా రికార్డు సృష్టించాడు.

2011 - డ్రా
2011 పర్యటనలో సౌతాఫ్రికా గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్ గెలిచే అవకాశాన్ని టీమిండియా తృటిలో చేజార్చుకుంది. మూడు టెస్టుల సిరీస్లో డర్బన్ వేదికగా జరిగిన మ్యాచ్ను గెలిచిన ధోనీసేన.. కేప్టౌన్లో జరిగిన మూడో టెస్టులో విజయం దిశగా దూసుకెళ్లింది. కానీ రెండో ఇన్నింగ్స్లో వీరోచిత శతకంతో సౌతాఫ్రికా స్టార్ ఆల్రౌండర్ జాక్వెస్ కలిస్ మ్యాచ్ను డ్రాగా ముగించాడు. ఇదే టెస్టులో సెంచరీ (146) బాదిన సచిన్కు ఈ ఫార్మాట్లో ఇదే చివరి శతకం కావడం విశేషం.

2018 పర్యటనలోనూ..
2018 పర్యటనలో తొలి టెస్టును కేప్టౌన్ వేదికగా ఆడిన టీమిండియా... బ్యాటింగ్ వైఫల్యంతో విజయం ముంగిట బోల్తాపడింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్ ద్వారానే టెస్టు అరంగేట్రం చేశాడు. ఈ టెస్టులో తొలి ఇన్నింగ్స్లో సౌతాఫ్రికాను 286 పరుగులకే కట్టడి చేసిన భారత్.. తన మొదటి ఇన్నింగ్స్లో 97 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా 95 బంతుల్లో 93 పరుగులతో భారత్ను గట్టెక్కించాడు. తర్వాత రెండో ఇన్నింగ్స్లో సౌతాఫ్రికా 130 పరుగులకే ఆలౌట్ చేసిన టీమిండియా.. ఈ మ్యాచ్లో విజయం సాధించే అవకాశాన్ని చేజిక్కించుకుంది. కానీ భారత బ్యాటర్లు విఫలమవడం వల్ల 135 పరుగులకే ఆలౌటై 72 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.


Click it and Unblock the Notifications
