కోహ్లీతో షురూ..
ముందుగా విరాట్ కోహ్లీ అభిమానులు భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. ఆల్ కేరళ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ పేరిట ఏర్పాటు చేసిన భారీ కటౌట్కు సంబంధించిన ఫొటో నెట్టింట క్షణాల్లోనే వైరల్ అయ్యింది. ఈ కటౌట్కు దేశవ్యాప్తంగా ఉన్న విరాట్ కోహ్లీ అభిమానులు ఫిదా అయ్యారు. కెప్టెన్సీ లేకున్నా క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదంటూ సంబరపడ్డారు. కొందరు అత్యుత్సాహంతో రోహిత్ శర్మ అభిమానులను ట్రోల్ చేశారు. రోహిత్ కెప్టెన్ అయినా.. అతనికి ఏ కటౌట్ లేదంటూ ట్రోల్ చేశారు.
రోహిత్, ధోనీ ఫ్యాన్స్ సైతం..
ఇది చూసిన రోహిత్ శర్మ అభిమానులు కోహ్లీ కంటే భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. ఈ ఫొటోలను షేర్ చేస్తూ.. విరాట్ అభిమానులను ఎగతాళి చేశారు. రోహిత్ కటౌట్లో విరాట్ది సగం కూడా లేదని సెటైర్లు పేల్చారు. ఆల్ కేరళ రోహిత్ శర్మ ఫ్యాన్స్ అసోసియేషన్ ఈ భారీ కటౌట్ను ఏర్పాటు చేయగా..దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. ఈ రెండు కటౌట్లును చూసిన ధోనీ అభిమానులు.. తమ వాడేం తక్కువ కాదంటూ.. భారీ ప్లెక్సీని ఏర్పాటు చేశారు.
జట్టులో లేకున్నా..
ఇక సంజూ శాంసన్ అభిమానులు సైతం.. తమ రాష్ట్ర హీరో అంటూ అతని భారీ కటౌట్ను ఏర్పాటు చేశారు. మైదానం ముందే ఈ నలుగు కటౌట్లు ఉండటంతో అభిమానులు సెల్ఫీలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం అక్కడ సినిమా థియేటర్ల ముందే వాతవారణం తలపిస్తోంది. సౌతాఫ్రికాతో ఆడే జట్టులో లేకున్నా సంజూ కటౌట్ ఏర్పాటు చేసి తమ ప్లేయర్పై ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్నారు.


Click it and Unblock the Notifications
