మార్పులు అనివార్యం..
రవీంద్ర జడేజా మొకాలి గాయంతో జట్టుకు దూరమవడంతో జట్టులో మార్పులు అనివార్యమయ్యాయి. పాక్ స్పిన్నర్లను ఎదుర్కొవాలంటే టీమిండియా తప్పనిసరిగా లెఫ్టార్మ్ బ్యాటర్లను ఆడించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్షర్ పటేల్, రిషభ్ పంత్లను జట్టులోకి తీసుకోడం అనివార్యమైంది. మరోవైపు హాంగ్ కాంగ్తో దారుణంగా విఫలమైన ఆవేశ్ ఖాన్ ఈ మ్యాచ్కు దూరం కానున్నాడని కోచ్ రాహుల్ ద్రవిడ్ తెలిపాడు. ప్రస్తుతం అతను జ్వరంతో బాధపడుతున్నాడని పేర్కొన్నాడు.
దడుసుకున్న పోరడు..
ఇక ఆవేశ్ ఖాన్కు జ్వరం రావడంపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లతో పాటు మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. భారత్ X పాకిస్థాన్ మ్యాచ్ అనగానే ఆవేశ్ ఖాన్ దడుసుకున్నాడని, అతనికి బుగులు జ్వరం పట్టుకుందని ట్రోల్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం జ్వరం ఏం లేదని పక్కనపెట్టేందుకు టీమ్మేనేజ్మెంట్ చెబుతున్నా సాకని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆవేశ్ ఖాన్ పేరు సోషల్ మీడియా వేదికగా మారుమోగుతోంది.
అట్టర్ ఫ్లాఫ్..
ఆసియా కప్ గ్రూప్ దశలో రెండు మ్యాచ్లు ఆడిన ఈ మధ్యప్రదేశ్ పేస్ బౌలర్... ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. పాకిస్థాన్పై జరిగిన మ్యాచ్లో రెండు ఓవర్లల్లో 19 పరుగులు ఇచ్చాడు. ఫకర్ జమాన్ వికెట్ తీసాడు. రెండో మ్యాచ్లో హాంకాంగ్పై పూర్తిగా చేతులెత్తేశాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 53 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక్కడా అతను పడగొట్టింది ఒక్క వికెట్ మాత్రమే. ఓవర్కు 13 చొప్పున పరుగులను సమర్పించుకున్నాడు. దాంతో ఆవేశ్ ఖాన్పై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి.


Click it and Unblock the Notifications












