
ధోనీ ఫార్మూలాతో..
అయితే ఇక్కడ విరాట్ కోహ్లీ... మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫార్మూలాను ఉపయోగించాడు. మహేంద్ర సింగ్ ధోనీ తన హాయంలో మ్యాచ్ను చివరి వరకు తీసుకెళ్లేవాడు. ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా.. ఆఖరి వరకు పోరాడాలనే చెప్పేవాడు. తాను పాటించేవాడు. లక్ష్యానికి సమీపిస్తున్న వేళ ఎంతటి మేటి బౌలర్లు అయినా ఒత్తిడికి లోనై తప్పిదాలు చేస్తారని, వాటిని మనం సద్వినియోగం చేసుకోవాలని యువ ఆటగాళ్లకు పదేపదే చెప్పేవాడు. ప్రాక్టీకల్గా ఎన్నో గేమ్స్లో తాను కడవరకు నిలిచి విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. 2011 వన్డే ప్రపంచకప్ ఫైనలే దీనికి ఓ మంచి ఉదహారణ.

ఎలాంటి ఒత్తిడి లేకుండా..
హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలు కూడా ధోనీ చెప్పిన ఈ విషయాన్ని చాలా ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఇటీవల హార్దిక్ సైతం ధోనీ గురించి మాట్లాడుతూ.. వ్యక్తిగత స్కోర్ చూడకుండా.. జట్టు స్కోర్ చూసి ఆడాలని ధోనీ చెప్పేవాడని, ఆ మాట తనకు ఇంకా గుర్తుందని తెలిపాడు. జట్టు స్కోర్ను చూసి ఆడితే మ్యాచ్లోని జట్టు పరిస్థితి బాగా అర్థమవుతుందని, పరిస్థితులకు తగ్గట్లు ఎలా ఆడాలో తెలుస్తుందనేది ధోనీ వ్యూహం. ఇదే ఫార్మూలాను హార్దిక్, విరాట్ కోహ్లీ నిన్నటి మ్యాచ్లో ఉపయోగించారు. 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయినా.. 10 ఓవర్లకు 45 పరుగులే చేసినా.. చివరి 18 బంతుల్లో 48 పరుగులు చేయాల్సి ఉన్నా... ఏ మాత్రం జంకలేదు.

ధోనీ సూత్రానికి కట్టుబడి..
ఒత్తిడికి గురవ్వలేదు. ధోనీ ఫార్మూలాకు కట్టుబడి మ్యాచ్ను చివరి వరకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మంచి బాల్స్ గౌరవిస్తూ చెత్త బంతులనే బౌండరీలకు తరలించారు. 19వ ఓవర్లో మ్యాచ్ చేజారుతున్న సమయంలో విరాట్ తన అనుభవాన్ని ఉపయోగించి చివరి రెండు బంతులను సిక్స్లుగా మలిచాడు. దాంతో భారత్ విజయానికి 6 బంతుల్లో 16 పరుగులు అవసరమవ్వగా.. పాకిస్థాన్ తీవ్ర ఒత్తిడికి గురైంది. తొలి బంతికి హార్దిక్ ఔటవ్వడంతో క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్.. రెండో బంతికి సింగిల్ తీయడంతో కోహ్లీ క్రీజులోకి వచ్చాడు.

పని చేసిన ప్రాథమికి సూత్రం..
ఇక కోహ్లీని చూసి భయపడ్డ మహమ్మద్ నవాజ్ ఫుల్టాస్ వేయగా.. దాన్ని విరాట్ సిక్సర్గా మలిచాడు. అదికాస్త నోబాల్ కావడం.. ఆ తర్వాత మరింత ఒత్తిడికి గురైన నవాజ్ వైడ్లు వేయడం.. ఫ్రీహిట్ బాల్ అనే సోయి లేకుండా ఉండిపోవడం చక చక జరిగిపోయాయి. ఇవన్నీ టీమిండియా లక్ కంటే.. పాకిస్థాన్ ఆటగాళ్లు ఒత్తిడికి గురవ్వడం వల్లే జరిగాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ధోనీ ఫార్మూలాతో విరాట్ కోహ్లీ బిగించిన ఉచ్చులో పాక్ ఆటగాళ్లు చిక్కుకున్నారు. మాజీ క్రికెటర్ అజయ్ జడేజా సైతం ధోనీ ఫార్మూలాతోనే విరాట్, హార్దిక్ ఆడారని తెలిపాడు.


Click it and Unblock the Notifications
