ఇప్పుడేం జరుగుతుందో శివయ్యా!
2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో కూడా ఇలానే వర్షం వచ్చి భారత్ కొంపముంచిందని, మరీ ఈ సారి ఏమవుతుందోనని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాటి సెమీస్లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్.. వరుణుడి అంతరాయం కలిసొచ్చిందని, రిజర్వ్ డేలో పిచ్ అనూహ్యంగా పేస్, స్వింగ్ను అనుకూలించడంతో బోల్డ్, మ్యాట్ హెన్రీ చెలరేగారని గుర్తు చేస్తున్నారు. ఈసారి కూడా వర్షం అంతరాయం కలిగిస్తుందని, ఈసారి భారత్ పరిస్థితి ఏంటోనని సందేహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇంగ్లండ్లో జరిగిన ప్రతీ ఐసీసీ ఈవెంట్కు ఇదే పరిస్థితి వస్తుందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ మెగా ఫైనల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవాలని కోరుకుంటున్నారు.
ఎవడ్రా వర్షాకాలంలో ప్లాన్ చేసింది..
ప్రతిష్టాత్మ మ్యాచ్కు వరుణుడు అంతరాయం కలిగించడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐసీసీపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. రెండేళ్లుగా ఎదురు చూస్తోన్న డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ను వర్షాకాలంలో షెడ్యూల్ చేసినందుకు ఐసీసీకి బుద్ది లేదని భగ్గుమంటోన్నారు. అసలు ఇంగ్లండ్లో ఎవడ్రా మ్యాచ్లు పెట్టమన్నదని కూడా మండిపడుతున్నారు.
తమ ఆగ్రహానికి కామెడీని జోడించి.. ట్వీట్లు చేస్తోన్నారు. ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. వర్షంలో బ్యాటింగ్ చేస్తూ జారిపడుతున్న వీడియోలను పంచుకుంటున్నారు. ఐసీసీకి ముందు చూపు లోపించిందంటూ విరుచుకుపడుతున్నారు.
ఫస్ట్ డే వాష్ ఔట్..
సౌతాంప్టన్లో ప్రస్తుతం సుమారు అయిదు గంటలుగా వర్షం కురుస్తూనే ఉంది. అప్పుడప్పుడు తెరపి ఇస్తోన్నప్పటికీ.. మేఘాలు పూర్తిగా తొలగిపోలేదు. గంటకు పైగా ఏకధాటిగా కురిసిన వర్షం వల్ల ఏజెస్ బౌల్ స్టేడియం మొత్తం చిత్తడిగా మారింది. బురదమయమైంది. పిచ్ డ్యామేజ్ కాకుండా గ్రౌండ్ స్టాఫ్ దాన్ని కప్పి ఉంచారు. ఔట్ ఫీల్డ్లో వర్షపు నీళ్లు నిలిచాయి. వర్షం పూర్తిగా తొలగిపోతేనే మ్యాచ్ నిర్వహించే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం అక్కడి పరిస్థితి చూస్తుంటే ఫస్ట్ డే ఆట జరగడం కష్టంగానే అనిపిస్తోంది.


Click it and Unblock the Notifications
