|
తొలి భారత ప్లేయర్గా..
భారత్ తరఫున అత్యంత వేగంగా 1000 వన్డే పరుగులు పూర్తి చేసుకున్న తొలి ప్లేయర్గా శుభ్మన్ గిల్ చరిత్రకెక్కాడు. ఓవరాల్గా రెండో ప్లేయర్గా నిలిచాడు. 19 వన్డే ఇన్నింగ్స్ల్లోనే శుభ్మన్ 1000 పరుగుల మైలు రాయి అందుకున్నాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ల రికార్డులను శుభ్మన్ అధిగమించాడు. విరాట్ కోహ్లీ, శిఖర్ ధవన్లు 24 ఇన్నింగ్స్ల్లో 1000 పరుగుల మైలు రాయి అందుకున్నారు.
|
ఓవరాల్గా రెండో ప్లేయర్..
ఓవరాల్గా ఈ జాబితాలో పాకిస్థాన్ బ్యాటర్ ఫకార్ జమాన్ అగ్రస్థానంలో ఉన్నాడు. అతను 18 ఇన్నింగ్స్ల్లోనే 1000 వన్డే పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత ఇమామ్ ఉల్ హక్, శుభ్మన్ గిల్(19) రెండో స్థానంలో ఉండగా.. వివ్ రిచర్డ్స్(21), కెవిన్ పీటర్సన్(21), జోనాథన్ ట్రోట్(21) ఉన్నారు.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ(34),శుభ్మన్ గిల్ శుభారంభం అందించారు. తొలి వికెట్కు 60 పరుగులు జోడించిన అనంతరం భారీ షాట్ ఆడే క్రమంలో రోహిత్ ఔటయ్యాడు.
శుభ్మన్ మినహా టాప్-5 విఫలం..
ఆ తర్వాత ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ(8) మిచెల్ సాంట్నర్ స్టన్నింగ్ డెలివరీకి బౌల్డ్ అయ్యాడు. ఆ వెంటనే ఇషాన్ కిషన్ కూడా క్యాచ్ ఔటవ్వగా.. సూర్యకుమార్ యాదవ్(31) తనదైన శైలిలో మెరుపులు మెరిపించాడు. కానీ ఎక్కువ సేపు ఆడలేకపోయాడు.
ఈ క్రమంలో హార్దిక్ పాండ్యాతో కలిసి శుభ్మన్ కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఐదో వికెట్కు 74 పరుగులు జోడించిన అనంతరం హార్దిక్ విచిత్ర పరిస్థితుల్లో పెవిలియన్ చేరాడు. దాంతో టీమిండియా 249 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది.