
సౌతాంప్టన్: టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సతీమణి ప్రీతి నారయణ్ క్రికెట్ అభిమానులు శుభవార్త అందించింది. ప్రస్తుతం అశ్విన్తో కలిసి ఇంగ్లండ్లోనే ఉన్నఆమె ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్కు సంబంధించిన కీలక అప్డేట్ అందించింది. ఈ మెగా ఫైనల్కు వర్షం ఆంటకం కలిగించడంతో టాస్ పడకుండానే ఫస్ట్ సెషన్ రద్దయిన విషయం తెలిసిందే.
అయితే ప్రస్తుతం వర్షం ఆగిపోయిందని ప్రీతి ట్వీట్ చేసింది. అంతేకాకుండా మైదానానికి సంబంధించిన వీడియోను కూడా పంచుకుంది. ఆ వీడియో ఫ్యాన్స్ స్టేడియంలో సందడి చేస్తుండగా.. ఆటగాళ్లు మైదానంలోకి దిగారు. కవర్లు మాత్రం కప్పి ఉన్నాయి.
అశ్విన్ సతీమణి ఉదయం నుంచి వర్షానికి సంబంధించిన అప్ డేట్స్ అభిమానులతో పంచుకుంటుంది. మైదానంలోనే ఆటగాళ్లు బస చేసే హోటల్ ఉండటంతో ఆమె తేలికగా ఫొటోలు, వీడియోలు తీస్తూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తుంది. విక్రాంత్ గుప్తా అనే మరో నెటిజన్ వర్షం ఆగిపోయిందని, మైదానంలో నుంచి కవర్లు కూడా తీసేశారని పేర్కొన్నాడు. అంతేకాకుండా మరికొద్దిసేపట్లో మ్యాచ్ కూడా ప్రారంభమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని తెలిపాడు.