భారత్తో జరుగుతున్న రెండో టెస్ట్లో న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్లో 255 పరుగులకు ఆలౌటైంది. దాంతో భారత్ ముందు 359 పరుగుల భారీ లక్ష్యం నమోదైంది. 198/5 ఓవర్నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను కొనసాగించిన న్యూజిలాండ్.. మరో 57 పరుగులు మాత్రమే జోడించి చివరి 5 వికెట్లు కోల్పోయింది.
ఓవర్నైట్ బ్యాటర్లు టామ్ బ్లండెల్(41), గ్లెన్ ఫిలిప్స్(48 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. భారత బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచిన ఈ జోడీని రవీంద్ర జడేజా స్టన్నింగ్ డెలివరీతో విడదీసాడు. టామ్ బ్లండెల్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. టీమ్ సౌథీ(0) అశ్విన్ ఔట్ చేయగా.. అజాజ్ పటేల్(1), విలియమ్ ఓ రూర్కీ(0)లను జడేజా పెవిలియన్ చేర్చి న్యూజిలాండ్ ఇన్నింగ్స్కు తెరదించాడు.

న్యూజిలాండ్ బ్యాటర్లలో టామ్ లాథమ్(133 బంతుల్లో 10 ఫోర్లతో 86)టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్(4/56) నాలుగు వికెట్లు తీయగా.. రవిచంద్రన్ అశ్విన్ రెండు, రవీంద్ర జడేజా మూడు వికెట్లు పడగొట్టారు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 259 పరుగులు చేసింది. డెవాన్ కాన్వే(141 బంతుల్లో 11 ఫోర్లతో 76), రచిన్ రవీంద్ర(105 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 65) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్(7/59), రవిచంద్రన్ అశ్విన్(3/64) కివీస్ పతనాన్ని శాసించారు.
అనంతరం భారత్.. తొలి ఇన్నింగ్స్లో 156 పరుగులకు కుప్పకూలింది. న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్(7/53) స్టన్నింగ్ బౌలింగ్తో టీమిండియా పతనాన్ని శాసించాడు. గ్లేన్ ఫిలిప్స్ 2 వికెట్లు తీయగా.. టీమ్ సౌథీ ఓ వికెట్ పడగొట్టాడు. భారత బ్యాటర్లలో రవీంద్ర జడేజా(38), యశస్వి జైస్వాల్(30), శుభ్మన్ గిల్(30) టాప్ స్కోరర్లుగా నిలిచారు. దాంతో న్యూజిలాండ్కు 103 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.