భారత్తో జరుగుతున్న నాలుగో టెస్ట్లో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 353 పరుగులకు కుప్పకూలింది. 302/7 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ 51 పరుగుల వ్యవధిలోనే చివరి మూడు వికెట్లు కోల్పోయింది.
ఓవర్నైట్ బ్యాటర్ ఓలీ రాబిన్సన్ ధాటిగా ఆడి 81 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతని జోరుకు రవీంద్ర జడేజా కళ్లెం వేసాడు. కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన షోయబ్ బషీర్(0), జేమ్స్ అండర్సన్(0)లను ఔట్ చేశాడు.

జో రూట్(274 బంతుల్లో 10 ఫోర్లతో 122 నాటౌట్) అజేయ శతకంతో నిలిచాడు. భారత బౌలర్లలో అరంగేట్ర పేసర్ ఆకాశ్ దీప్ మూడు వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా(4/67) నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. మహమ్మద్ సిరాజ్ రెండు వికెట్లు తీయగా.. రచిన్ రవీంద్ర ఓ వికెట్ పడగొట్టాడు.