
అరగంట ముందే మ్యాచ్..
ఇక ఈ మ్యాచ్ను నిర్ణీత సమయం కన్నా ఓ అరగంట ముందే ప్రారంభించాలని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) నిర్ణయించింది. భారత అభిమానుల కొరకు మ్యాచ్ను అరగంట ముందుగా ప్రారంభించనున్నట్లు ఓ ప్రకటనను కూడా విడుదల చేసింది. వాస్తవానికి జూలై 1న టీమిండియా- ఇంగ్లండ్ టెస్టు భారత కాలామాన ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకి( ఇంగ్లండ్ లోకల్ టైం ఉదయం 11 గంటలు) ప్రారంభం కావాల్సి ఉంది.

ఫ్యాన్స్ ఖుషీ..
తాజాగా ఈసీబీ మ్యాచ్ సమయాన్ని అరగంట ముందుకు మార్చింది. దీని ప్రకారం మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు(లోకల్ టైం ఉదయం 10:30 గంటలు) ప్రారంభమై రాత్రి 10 లేదా 10:30 గంటల వరకు జరగనుంది. దాంతో అర్థరాత్రి వరకు వేచి చూడాల్సిన అవసరం అభిమానులకు తప్పనుంది. ఉదయం ఆఫీసులకు ఆలస్యంగా వెళ్లాల్సిన పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఈ క్రమంలోనే ఈసీబీ నిర్ణయాన్ని అభిమానులు స్వాగతిస్తున్నారు.
ఐదు రోజుల పాటు జరగనున్న టెస్టు మ్యాచ్లో రోజు 90 ఓవర్లు ఆట సాధ్యమయ్యేలా ఈసీబీ ప్రణాళికలు రచించింది. ఇక టెస్టు మ్యాచ్ ముగిసిన తర్వాత జూలై 7, 9,10 తేదీల్లో మూడు టీ20లు.. ఆ తర్వాత జూలై 12,14, 17వ తేదీల్లో మూడు వన్డేలు జరగనున్నాయి.

రోహిత్కు కరోనా..
కాగా రోహిత్ శర్మ కరోనా పాజిటివ్గా తేలినట్లు ఆదివారం ఉదయం బీసీసీఐ ప్రకటించింది. శనివారం నిర్వహించిన యాంటిజెన్ పరీక్షల్లో అతడికి వైరస్ నిర్ధారణ అయినట్లు బీసీసీఐ ఆదివారం తెల్లవారుజామున ట్వీట్ చేసింది. ప్రస్తుతం అతను టీమ్ బస చేసిన హోటల్లోనే ప్రత్యేకంగా క్వారంటైన్లో ఉన్నట్లు వెల్లడించింది. ఇక లీసెస్టర్ జట్టుతో జరుగుతోన్న వార్మప్ మ్యాచ్లో గురువారం తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసి 25 పరుగులు చేశాడు. కానీ, శనివారం రెండో ఇన్నింగ్స్ సందర్భంగా బ్యాటింగ్కు రాలేదు. ఈ క్రమంలోనే రోహిత్కు పాజిటివ్గా తేలడంతో ఇరు జట్లలో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది.


Click it and Unblock the Notifications












