
ఆటగాళ్లను పంపించలేం..
అయితే టీమిండియా స్పెషలిస్ట్ వికెట్ కీపర్లు ఇద్దరు ఐసోలేషన్లో ఉండటం టీమ్మేనేజ్మెంట్ను కలవరపెడుతుంది. కేఎల్ రాహుల్ రూపంలో మరో వికెట్ కీపర్ అందుబాటులో ఉన్నప్పటికీ అతను ఇప్పటి వరకు టెస్ట్ల్లో కీపింగ్ చేయలేదు. అయితే కరోనా నేపథ్యంలో బ్యాకప్గా మరికొంతమంది ఆటగాళ్లను పంపించే అవకాశమే లేదని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితులకు అనుగుణంగానే మొత్తం 20 మంది ప్లేయర్లతో పాటు నలుగురిని బ్యాకప్గా పంపించామన్నారు. పైగా ఇంగ్లండ్ ప్రయాణ ఆంక్షల మధ్య కొత్తగా ప్లేయర్స్ను పంపించడం కుదరదని స్పష్టం చేశాయి. ఆస్ట్రేలియా పర్యటనలో కూడా సీనియర్ ఆటగాళ్ల గాయాలైన సందర్భంలో యువ ఆటగాళ్లు సత్తా చాటారని, చిరస్మరణీయ విజయాన్నందించారని గుర్తు చేశాయి.

మూడు రోజుల వామప్ మ్యాచ్..
ఇంగ్లండ్ సిరీస్కు సన్నాహాకంగా బీసీసీఐ డర్హమ్లో ట్రైనింగ్ క్యాంప్ ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా 20వ తేదీ నుంచి కౌంటీ ఎలెవన్ టీమ్తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ఇంగ్లండ్లోని వివిధ కౌంటీ టీమ్స్ నుంచి ఈ మ్యాచ్కు 15 మంది ప్లేయర్లను ఎంపిక చేశారు. వార్విక్షైర్ కెప్టెన్ విల్ రోడ్స్ ఈ టీమ్కు నాయకత్వం వహించనున్నాడు. ఈ మూడు రోజుల వామప్ మ్యాచ్ పూర్తిగా ఖాళీ స్టేడియంలో జరగనుంది. పంత్, సాహా ఈ మ్యాచ్కు దూరం కావడంతో కేఎల్ రాహుల్ కీపర్గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.

పంత్కు డెల్టా వేరియంట్..
ఇంగ్లండ్లో ఇటీవల డెల్టా వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతమున్న సమాచారం మేరకు రిషభ్ పంత్ కూడా ఈ డెల్టా బారిన పడినట్లు తెలుస్తోంది. ఇటీవల యూరో చాంపియన్షిప్ మ్యాచ్ను చూసొచ్చిన పంత్.. తేలికపాటి జ్వరంతో బాధపడ్డాడు. ఆ సమయంలో చేయించుకున్న పరీక్షల్లో అతనికి పాజిటీవ్ వచ్చినట్లు తెలుస్తోంది. దాంతో పంత్ 9 రోజులుగా ఐసోలేషన్లో ఉన్నాడని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications












