For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఎంఎస్ ధోనీకే సాధ్యం కాలేదు.. టీ20ల్లో కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ అరుదైన రికార్డ్!!

Ind vs Aus: Virat Kohli becomes first Indian captain to win Test, ODI and T20I series in Australia
Ind vs Aus 2020 : Virat Kohli Becomes First Indian Captain To Win T20I Series In All SENA Countries

సిడ్నీ: మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్‌ 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకున్నవిషయం తెలిసిందే. ఈ విజయంతో కోహ్లీసేన మరో టీ20 మ్యాచ్ మిగిలి ఉండగానే.. సిరీస్‌ని 2-0తో చేజిక్కించుకుంది. దాంతో కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ ఓ అరుదైన ఘనత అందుకున్నాడు. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా గడ్డలపై టీ20 సిరీస్‌ని గెలిచిన తొలి భారత కెప్టెన్‌గా అరుదైన ఘనత సాదించాడు. టీమిండియా అత్యంత విజయవంతమైన కెప్టెన్ ఎంఎస్ ధోనీకి సైతం సాధ్యం కాని రికార్డును కోహ్లీ సాదించాడు.

కోహ్లీ అరుదైన రికార్డ్

కోహ్లీ అరుదైన రికార్డ్

మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నుంచి 2017లో విరాట్ కోహ్లీ టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టు పగ్గాలు అందుకున్నాడు. అప్పటినుంచి ముఖ్యంగా టీ20ల్లో భారత్‌కి వరుస విజయాల్ని అందిస్తున్నాడు. 2018లో కోహ్లీ కెప్టెన్సీలో దక్షిణాఫ్రికా గడ్డపై టీ20 సిరీస్ గెలిచిన భారత్.. అదే ఏడాది ఇంగ్లండ్‌లోనూ టీ20 సిరీస్ గెలుచుకుంది. ఈ ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్‌ గడ్డపై టీ20 సిరీస్‌ గెలిచిన కోహ్లీసేన.. తాజాగా ఆస్ట్రేలియా గడ్డపైనా సిరీస్ కైవసం చేసుకుంది. 2007 నుంచి 2017 వరకూ కెప్టెన్‌గా ఉన్న ధోనీ ఈ రికార్డ్ అందుకోకపోవడం విశేషం.

మూడు సిరీస్‌లను గెలిచిన ఏకైక సారథి

మూడు సిరీస్‌లను గెలిచిన ఏకైక సారథి

విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డు కూడా నెలకొల్పాడు. ఇప్పటివరకు ఆస్ట్రేలియా గడ్డపై ఏ భారత కెప్టెన్‌కు సాధ్యం కాని రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. కంగారూల గడ్డపై టెస్ట్, వన్డే, టీ20 సిరీస్‌లను గెలిచిన ఏకైక సారథిగా నిలిచాడు. కోహ్లీ సారథ్యంలో ఆసీస్ గడ్డపై 2018-19లో టెస్ట్, వన్డే సిరీస్ గెలిచిన విషయం తెలిసిందే. తాజాగా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే.. టీమిండియా 2-0తో టీ20 సిరీస్ గెలుచుకుంది. దీంతో కోహ్లీ ఖాతాలో అరుదైన రికార్డు చేరింది. కోహ్లీ నాయకత్వలో చివరిగా ఆడిన 10 టీ20 మ్యాచ్‌ల్లో టీమిండియాకి అసలు ఓటమే లేదు. అంతేకాదు టీ20ల్లో 190పైచిలుకు లక్ష్యాన్ని ఇప్పటికే ఏడు సార్లు భారత్ విజయవంతంగా ఛేదించేసింది.

ఛేజింగ్‌లో కింగ్

ఛేజింగ్‌లో కింగ్

ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 మ్యాచ్‌ల పరంగా చూస్తే అత్యధిక పరుగుల ఛేజింగ్‌లో టీమిండియానే టాప్‌-2 స్థానాలను ఆక్రమించింది. 2016లో ఆసీస్‌తో జరిగిన టీ20లో టీమిండియా 198 పరుగుల టార్గెటన్‌ను ఛేదించింది. మళ్లీ ఇప్పుడు 195 పరుగుల టార్గెట్‌ను ఆస్ట్రేలియాపై వారి దేశంలోనే ఛేజ్‌ చేసింది. ఫలితంగా ఆసీస్‌పై ఆస్ట్రేలియాలో అత్యధిక పరుగుల ఛేజింగ్‌ రికార్డుల్లో తొలి రెండు స్థానాల్లో టీమిండియా నిలిచింది. అయితే ఈ రెండు మ్యాచ్‌లు సిడ్నీలో జరగడం మరొక విశేషం. టీమిండియా తర్వాత స్థానంలో శ్రీలంక ఉంది. 2017లో 174 పరుగుల టార్గెట్‌ను ఆసీస్‌పై వారి దేశంలో ఛేజ్‌ చేశారు లంకేయులు.

పాకిస్తాన్‌తో కలిసి మూడో స్థానంలో

పాకిస్తాన్‌తో కలిసి మూడో స్థానంలో

అంతర్జాతీయ టీ20ల్లో వరుసగా విజయాలు సాధించిన జాబితాలో పాకిస్తాన్‌తో కలిసి టీమిండియా సంయుక్తంగా మూడో స్థానంలో ఉంది. ఈ ఏడాది భారత్ వరుసగా సాధించిన టీ20 విజయాలు 9. 2018లో పాకిస్తాన్‌ వరుసగా 9 విజయాలు అందుకుంది. తొలి స్థానంలో అఫ్గానిస్తాన్‌ ఉంది. అఫ్గానిస్తాన్‌ 2016-17 సీజన్‌లో వరుసగా 11 విజయాలు సాధించగా.. 2018-19 సీజన్‌లో 12 విజయాలు సాధించింది. తొలి రెండు స్థానాల్లో అఫ్గానిస్తానే ఉంది.

కోహ్లీ vs డివిలియర్స్: ఒకటే మైదానం.. ఒకేలా షాట్ (వీడియో)

Story first published: Monday, December 7, 2020, 12:28 [IST]
Other articles published on Dec 7, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+