
ఆసీస్ ఆలౌటైనా..
అంతకుముందు 156/4 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ను కొనసాగించిన ఆస్ట్రేలియా.. అశ్విన్(3/44), ఉమేశ్ యాదవ్(3/12) ధాటికి 197 పరుగులకు కుప్పకూలింది. 11 పరుగుల వ్యవధిలోనే ఆ జట్టు చివరి 6 వికెట్లను కోల్పోయింది. ఉస్మాన్ ఖవాజా(60), మార్నస్ లబుషేన్(31), కామెరూన్ గ్రీన్(21) టాప్ స్కోరర్లుగా నిలిచారు. దాంతో ఆసీస్కు 89 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.

రోహిత్, కోహ్లీ మళ్లీ విఫలం..
అనంతరం రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్లు శుభ్మన్ గిల్(5), రోహిత్ శర్మ(33 బంతుల్లో 12) శుభారంభం అందించడంలో మరోసారి విఫలమయ్యారు. లయన్ బౌలింగ్లో ధాటిగా ఆడే క్రమంలో గిల్ క్లీన్ బౌల్డ్ కాగా.. రోహిత్ వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ(13), రవీంద్ర జడేజా(7) వరుసగా ఔటయ్యారు. ఈ పరిస్థితుల్లో పుజారాతో కలిసి శ్రేయస్ అయ్యర్(27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 26) అటాకింగ్ గేమ్ ఆడాడు. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని స్మిత్.. మిచెల్ స్టార్క్ సాయంతో విడదీసాడు. ఉస్మాన్ ఖవాజా స్టన్నింగ్ క్యాచ్కు అయ్యర్ వెనుదిరిగాడు.

పుజారా పోరాడినా..
ఆ వెంటనే శ్రీకర్ భరత్(3) పేలవ రీతిలో క్లీన్ బౌల్డ్ అవ్వగా.. రవిచంద్రన్ అశ్విన్(16) లయన్కు వికెట్ల ముందు దొరికిపోయాడు. పుజారా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని ఒంటరిపోరాటం చేయగా.. లయన్ అతన్ని పెవిలియన్ చేర్చాడు. స్మిత్ స్టన్నింగ్ క్యాచ్కు పుజారా ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన ఉమేశ్ యాదవ్ భారీ షాట్ ఆడబోయి పెవిలియన్ చేరగా.. సిరాజ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో భారత ఇన్నింగ్స్ ముగిసింది. మరోసారి అక్షర్ పటేల్(15 నాటౌట్) అజేయంగా నిలిచాడు.


Click it and Unblock the Notifications
