
చెన్నై: భారత్ -ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో వన్డేలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆసీస్ ముందుగా బ్యాటింగ్ చేపట్టగా.. మైదానంలో ఊహించని అతిథి వచ్చింది. దాంతో ఆటకు అంతరాయం కలగగా.. సెక్యూరిటీ సిబ్బంది పరుగులు పెట్టారు. ఇంతకీ ఆ అతిథి ఎవరంటే శునకం. సెక్యూరిటీ కళ్లు గప్పిన ఓ డాగ్.. మైదానంలోకి దూసుకొచ్చింది. దాంతో ఆట కొద్దిసేపు ఆగిపోగా.. ఆ శునకాన్ని బయటకు వెళ్లగొట్టేందుకు సెక్యూరిటీ సిబ్బంది నానా కష్టాలు పడ్డారు. మైదానమంతా పరుగెత్తించిన ఆ శునకం చివరకు మైదానం వీడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
అయితే సెక్యూరిటీని పరుగెత్తించిన ఆ శునకం అందర్నీ నవ్వించింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 43 ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ నాలుగో బంతి వేసే ముందు శునకం మైదానంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ డాగ్తో రవీంద్ర జడేజా కాస్త ఫన్ క్రియేట్ చేశాడు. దాన్ని పట్టుకుంటున్నట్లు సైగలు చేసి డాగ్ను బయపెట్టాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో, ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. అభిమానులు కూడా ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ మైదానంలోకి వచ్చాడనే ఒకరంటే.. మ్యాచ్ ఫిక్సింగ్ చేసేందుకు ఆ శునకాన్ని పంపించారని మరొకరు కామెంట్ చేశారు.