For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఓడిపోయామని మీడియా ముందు కన్నీరు కార్చిన కెప్టెన్

Incredibly Frustrating, Ireland Captain In Tears After Pakistan Loss In Womens World T20. Watch Video

హైదరాబాద్: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఐర్లాండ్‌కు రెండో ఓటమి. గ్రూపు-బిలో భాగంగా పాకిస్థాన్‌, ఐర్లాండ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో పాక్‌‌తో 38పరుగుల తేడాతో ఓడింది. మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన పాకిస్థాన్‌ నిర్ణీత 20ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 139పరుగులు చేసింది. కెప్టెన్‌ జవేరియా ఖాన్‌ నాటౌట్‌గా నిలిచి 52బంతుల్లో 11ఫోర్లతో (74)పరుగులు చేసింది. దూకుడైన హాఫ్ సెంచరీతో స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించింది.

ఐర్లాండ్‌ ఆరంభం నుంచే వికెట్లు కోల్పోయి

ఐర్లాండ్‌ ఆరంభం నుంచే వికెట్లు కోల్పోయి

140 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా బరిలోకి దిగిన ఐర్లాండ్‌ ఆరంభం నుంచే వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్‌ షిల్లింగ్టన్‌(27), వన్‌డౌన్‌ బ్యాట్స్‌వుమెన్‌ జోసీ(30) మినహా మిగిలిన వాళ్లంతా సింగిల్‌ డిజిట్‌ను దాటలేకపోయారు. దీంతో 20ఓవర్లలో ఐర్లాండ్‌ మహిళల జట్టు 9 వికెట్ల నష్టానికి 101పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇలా ఐర్లాండ్‌కు టోర్నీలో రెండో ఓటమి ఎదురుకావడంతో కుంగిపోయింది.

సైనాకు చుక్కెదురు, సింధు, శ్రీకాంత్‌ల శుభారంభం

పాక్‌పై ఓటమి తమనెంతగానో నిరాశపరిచిందంటూ

పాక్‌పై ఓటమి తమనెంతగానో నిరాశపరిచిందంటూ

మ్యాచ్‌ అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ఐర్లాండ్‌ కెప్టెన్‌ లారా డెలానీ పాక్‌పై ఓటమి తమనెంతగానో నిరాశపరిచిందంటూ ఒక్కసారిగా కన్నీరు పర్వంతమయ్యారు. ప్రొఫెషనల్‌గా ఆడకపోవడం వల్లనే తమ జట్టుకు ఓటమి తప్పలేదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఐసీసీ ట్విటర్‌ ఖాతా ద్వారా పంచుకుంది.

స్కోరు అక్కడితో ఆగేది కాదు

మేమే ప్రొఫెషనల్ ప్లేయర్లు అయితే స్కోరు అక్కడితో ఆగేది కాదు. ఇంకా బాగా రాణించేవాళ్లమంటూ ఐర్లాండ్ కెప్టెన్ లారా డెలానీ మీడియా సమావేశంలో భావోద్వేగానికి గురైంది. పాకిస్తాన్ జట్టుపై గెలుస్తామనే ఆశలు నిలబెట్టుకోకపోవడంతో ఆమె అలా స్పందించిందంటూ ఐసీసీ వరల్డ్ ట్వంటీ 20 ఆ వీడియోను పోస్టు చేస్తూ.. ట్వీట్ చేసింది.

సూపర్ ఫామ్‌లో ఉన్న భారత్.. మూడో టీ20లో

సూపర్ ఫామ్‌లో ఉన్న భారత్.. మూడో టీ20లో

గ్రూపు-బిలో ఐర్లాండ్‌ గురువారం భారత్‌తో తలపడనుంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌లను సునాయాసంగా గెలిచేసి సూపర్ ఫామ్‌లో ఉన్న భారత్.. మూడో టీ20ని గెలిచేందుకు సమాయత్తమవుతోంది. ఈ క్రమంలో గెలిస్తే మాత్రం దాదాపు సెమీస్‌ స్థానం ఖరారైనట్లే. ఇక గ్రూప్‌-బిలో మిగిలిన మ్యాచ్‌లు నామమాత్రమే ఆడాల్సిందే. ఫలితాలను బట్టి పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌, ఐర్లాండ్‌ టోర్నీ నుంచి నిష్క్రమించనున్నాయి. ఆస్ట్రేలియా ఇప్పటికే సెమీస్‌ చేరింది.

Story first published: Thursday, November 15, 2018, 11:50 [IST]
Other articles published on Nov 15, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+