2014 టీ20 ప్రపంచకప్లో..
ధోనీ 2013లో భారత జట్టును ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలబెట్టగా.. 2014 టీ20 ప్రపంచకప్లో ఫైనల్స్ వరకూ తీసుకెళ్లాడు. అక్కడ లంక చేతిలో భారత్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అయితే, అంతకుముందు దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్స్లో ఓ సరదా సంఘటన చోటుచేసుకుంది. అదే కోహ్లీ కోసం ధోనీ త్యాగం చేయడం. సెమీఫైనల్స్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 172/4 స్కోర్ సాధించింది.

విన్నింగ్ షాట్ త్యాగం..
అనంతరం కోహ్లీ ( 44 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 72 నాటౌట్) అర్ధశతకంతో రెచ్చిపోవడంతో భారత్ 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఆ మ్యాచ్ 19 ఓవర్లకే పూర్తి అవ్వాల్సి ఉన్నా చివరి ఓవర్ వరకూ వెళ్లిందంటే కారణం ధోనీనే. బ్యూరన్ హెన్రిక్స్ వేసిన 18.5వ బంతికి కోహ్లీ సింగిల్ తీయడంతో టీమిండియా స్కోరు 172.. సౌతాఫ్రికాతో సమం అయింది. తర్వాతి బంతికి ధోనీ ఒక పరుగు తీస్తే భారత్ విజయం సాధిస్తుందనగా డిఫెన్స్ ఆడి వదిలేశాడు.

బ్రో ఎందుకు.. నీ కోసమే బ్రో
మరో ఎండ్లో ఉన్న కోహ్లీ అది చూసి నవ్వుకున్నాడు. అలా ఎందుకు చేశావని కెప్టెన్ను చూస్తూ సైగలు చేశాడు. అయితే, కోహ్లీ అప్పటికే 68 పరుగులతో ఉండడంతో.. విన్నింగ్ షాట్ కూడా అతడే కొట్టాలని ధోనీ భావించాడు. దీంతో డేల్స్టెయిన్ వేసిన చివరి ఓవర్ తొలి బంతిని కోహ్లీ ఫోర్గా మలిచి జట్టును గెలిపించాడు. ఆ వీడియోనే ఐసీసీ తాజాగా ట్విటర్లో పంచుకుంది.


Click it and Unblock the Notifications












