దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్లో టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ తమ ర్యాంకులను నిలబెట్టుకున్నారు. బ్యాటింగ్ విభాగంలో 857 రేటింగ్ పాయింట్లతో కోహ్లీ రెండో స్థానంలో ఉండగా.. 825 రేటింగ్ పాయింట్లతో రోహిత్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. 865 పాయింట్లతో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ అగ్రస్థానంలో ఉన్నాడు.
బౌలర్ల ర్యాంకింగ్స్లో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 690 రేటింగ్ పాయింట్స్తో జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్లో నంబర్వన్గా ఉన్నాడు. వన్డే ఆల్రౌండర్ల జాబితాలో భారత్ నుంచి రవీంద్ర జడేజా ఒక్కడే తొమ్మిదో స్థానంలో నిలిచాడు. బంగ్లాదేశ్ సీనియర్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ 387 పాయింట్లతో టాప్లో ఉన్నాడు.
ఇటీవల ముగిసిన శ్రీలంక-బంగ్లాదేశ్ వరల్డ్కప్ సూపర్కప్ సిరీస్లో ఆకట్టుకునే ప్రదర్శన చేసిన పలువురు క్రికెటర్లు.. మెరుగైన ర్యాంకులు అందుకున్నారు. వీరిలో బౌలర్ దస్మంత చమీరా(33), కెప్టెన్ కుశాల్ పెరీరా(42), స్పిన్నర్ ధనంజయ్ డిసిల్వా(85) స్థానాల్లో ఉన్నారు. ఈ మూడు వన్డేల సిరీస్ను బంగ్లాదేశ్ 2-1తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.