
టాప్లో ఆసీస్..
ప్రస్తుతానికి ఈ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా జట్టు 136 పాయింట్లతో టాప్లో నిలిచి ఫైనల్ బెర్త్ను ఖారారు చేసుకుంది. 14 మ్యాచ్లాడిన భారత్ 8 మ్యాచ్ల్లో మాత్రమే గెలిచి 99 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. శ్రీలంక 10 మ్యాచ్లాడి 5 విజయాలతో 64 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. అలానే దక్షిణాఫ్రికా కూడా 13 మ్యాచ్లాడి 6 విజయాలతో 76 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. కానీ ఆస్ట్రేలియా మాత్రం 15 మ్యాచ్లాడి 10 విజయాలు సాధించింది. కరోనా టైమ్ నుంచి జట్ల ర్యాంకింగ్స్ని పాయింట్ల ఆధారంగా కాకుండా మ్యాచ్ల గెలుపు శాతం ఆధారంగా నిర్ణయిస్తున్నారు. దాంతో ఆస్ట్రేలియా (75.56%), భారత్ (58.93%), శ్రీలంక (53.33%), దక్షిణాఫ్రికా (48.72%) టాప్-4లో కొనసాగుతున్నాయి.

విజయం సాధిస్తేనే ఫైనల్ బెర్త్..
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ (2021-2023) ఫైనల్కి భారత్ అర్హత సాధించాలంటే? గురువారం నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభంకానున్న నాలుగు టెస్టుల సిరీస్ను తప్పక గెలవాల్సి ఉంది. కనీసం రెండు మ్యాచ్ల్లో విజయం సాధించినా.. ఫైనల్ బెర్త్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఒకవేళ ఓడితే మాత్రం ఫైనల్ బెర్తు చేజారే ప్రమాదం ఉంది. ఈ సిరీస్కి భారత్ ఆతిథ్యం ఇస్తుండటం టీమిండియాకి గొప్ప ఊరట.

అప్పుడు ఓటమి..
డబ్లూటీసీ తొలి ఎడిషన్లో కూడా అసాధారణ ప్రదర్శనతో ఫైనల్ చేరిన టీమిండియా.. కీలక ఫైనల్లో మాత్రం న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలైంది. వర్షం అంతరాయం కారణంగా 6 రోజుల పాటు జరిగిన ఈ మ్యాచ్లో టీమిండియా విజయవకాశాలు దెబ్బతిన్నాయి. ఇక ఐపీఎల్ 2023 సీజన్ అనంతరం తాజా ఎడిషన్ ఫైనల్ జరగనుండటం టీమిండియా(ఫైనల్ చేరితే) ప్రతికూలం కానుంది.


Click it and Unblock the Notifications












