
ఐపీఎల్ ఆడటం డౌట్
'ఆర్చర్ గాయాన్ని మెడికల్ టీమ్ అంచనా వేస్తుంది. దానిని బట్టే ట్రీమ్మెంట్, రిహాబిలిటేషన్, రీఎంట్రీ ఉంటుంది. అది ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేం. కాబట్టి ఐపీఎల్ స్టార్టింగ్ మ్యాచ్లకు ఆర్చర్ అందుబాటులో ఉండటం కష్టంగా మారింది'అని ఈసీబీ పేర్కొంది. ఈ ప్రకటనను బట్టి చూస్తే గాయం నయం కాకుంటే ఆర్చర్ ఐపీఎల్ మొత్తానికి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐపీఎల్ 2020 సీజన్లో 14 మ్యాచ్లాడిన జోప్రా ఆర్చర్ 20 వికెట్లు పడగొట్టిన విషయం తెలిసిందే.

మళ్లీ రావడం కష్టమే..
ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచ్లు ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకూ జరగనుండగా.. ఏప్రిల్ 4 నుంచే అన్ని ఫ్రాంఛైజీలు క్యాంప్లను ఏర్పాటు చేయబోతున్నాయి. ఈ క్రమంలో కరోనా వైరస్ పరీక్షలు, క్వారంటైన్ తర్వాత ఐపీఎల్ 2021 సీజన్ బయో- సెక్యూర్ బబుల్లోకి టీమ్లు వెళ్లనున్నాయి. దాంతో.. ఇప్పుడు గాయంతో స్వదేశానికి వెళ్లనున్న జోప్రా ఆర్చర్.. మళ్లీ ఐపీఎల్ 2021 సీజన్ కోసం భారత్కి రావడం అనుమానంగానే కనిపిస్తోంది.

రాజస్థాన్కు కోలుకోలేని దెబ్బ..
ఐపీఎల్ 2018 నుంచి రాజస్థాన్ రాయల్స్ టీమ్కి జోప్రా ఆర్చర్ ఆడుతున్నాడు. ఆ ఏడాది 15 వికెట్లు పడగొట్టిన ఆర్చర్.. 2019లో 11 వికెట్లు మాత్రమే తీశాడు. కానీ.. ఐపీఎల్ 2021 సీజన్లో అసాధారణరీతిలో ఆర్చర్ రాణించాడు. ఫస్ట్ పవర్ప్లేలో పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు తీయగలిగే ఆర్చర్.. స్లాగ్ ఓవర్లలోనూ ప్రత్యర్థి బ్యాట్స్మెన్లను కట్టడి చేయగలడు. ఈ నేపథ్యంలో.. ఆర్చర్ లేకపోతే రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ విభాగం బలహీనపడనుంది. కనీసం ఐపీఎల్ 2021 సీజన్ మధ్యలోనైనా ఆర్చర్ భారత్కి వస్తాడని రాజస్థాన్ ఆశిస్తోంది. కానీ.. క్లారిటీ మాత్రం ఈ పేసర్ ఇవ్వడం లేదు.


Click it and Unblock the Notifications
