ఆసియా కప్ 2025 టోర్నీ తుది దశకు చేరింది. ఆదివారం జరిగే ఫైనల్లో దాయాదీ దేశాలు భారత్, పాకిస్థాన్ తలపడనున్నాయి. ఈ టోర్నీలో ఇప్పటికే భారత్, పాకిస్థాన్ జట్లు రెండు సార్లు తలపడ్డాయి. ఈ రెండు మ్యాచ్ల్లోనూ పాకిస్థాన్ను భారత్ చిత్తు చేసింది. భారత్ చేతిలో చిత్తుగా ఓడినా.. పట్టుదలతో ఆడిన పాకిస్థాన్ ఫైనల్ చేరింది. తుది పోరులో భారత్ను ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో పాక్ ఉంది.అయితే ఫామ్ చూసుకున్నా.. బలబలాలు పరిశీలించినా.. ఈ మ్యాచ్లో టీమిండియాకు పాకిస్థాన్ ఏ మాత్రం పోటీ కాదు. అలా అని పాకిస్థాన్ను ఏ మాత్రం తక్కువ అంచనా వేసినా భారత జట్టు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.
భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన సూపర్-4 మ్యాచ్లో ఆటగాళ్ల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పాకిస్థాన్ ఆటగాళ్లు కవ్వింపులకు పాల్పడటం.. భారత ఆటగాళ్లు బ్యాట్తో బదులివ్వడంతో వాతావరణ వేడెక్కింది. ఫైనల్లో అంతుకుమించిన డ్రామా ఉండనుంది. ఏకపక్షంగా సాగిన ఈ టోర్నీని చాలా మంది అభిమానులు పట్టించుకోలేదు. మరికొందరు ఈ టోర్నీ అధికారిక బ్రాడ్కాస్టర్ అయిన సోనీ టీవీ, సోనీ లైవ్ సబ్స్క్రిప్షన్ తీసుకోలేక లైట్ తీసుకున్నారు.

సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే డబ్బులు చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ మ్యాచ్లను మొబైల్స్లో ఫ్రీగా చూసే అవకాశం కూడా ఉంది. ముఖ్యం జియో యూజర్లు.. ప్రత్యేక రిచార్జ్ ప్లాన్స్తో సోనీ లివ్ యాప్ను ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఆ ప్లాన్స్ వివరాల గురించి తెలుసుకుందాం.