
న్యూఢిల్లీ: ఈ తరం క్రికెటర్లలో ఎక్కువ ప్రజాదరణ కలిగిన ఆటగాళ్లలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ విషయాన్ని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు తేల్చాయి. భారత్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అతనికి అభిమానులు ఉన్నారు. అతన్ని ఒక్కసారైన కలవాలని, కుదిరితే కలిసి ఫొటోలు దిగాలని ఎంతోమంది ప్రయత్నిస్తుంటారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలోనూ అభిమానులు మైదానంలోకి దూసుకొచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్ కూడా తాము కూడా కోహ్లీ అభిమానేని తెలిపింది. విరాట్తో కలిసి ఫొటో దిగాలనుకున్న తమ కల నెరవేరిందని తాజాగా ట్వీట్ చేసింది.