టీమిండియా మాజీ ఆల్రౌండర్ స్టువర్ట్ బిన్నీ సంచలన బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. హాంకాంగ్ సిక్సెస్ టోర్నీలో యూఏఈతో శనివారం జరిగిన మ్యాచ్లో బిన్నీ 11 బంతుల్లోనే 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 44 పరుగులు చేశాడు. అయినా ఈ మ్యాచ్లో భారత్ ఓటమిపాలైంది.
ఆఖరి ఓవర్లో భారత్ విజయానికి 32 పరుగులు అవసరమవ్వగా.. స్టువర్ట్ బిన్నీ వరుసగా 4, వైడ్, 6, 6, 6, 6, 1 బాదాడు. ఆఖరి బంతికి క్విక్ డబుల్ తీసే ప్రయత్నంలో రనౌటయ్యాడు. దాంతో భారత్ ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది. ప్రస్తుతం స్టువర్ట్ బిన్నీ బ్యాటింగ్కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.

మాజీ క్రికెటర్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో పూల్-సీలో భాగంగా భారత్.. యూఏఈతో తలపడింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన యూఏఈ నిర్ణీత 6 ఓవర్లలో 5 వికెట్లకు 130 పరుగులు చేసింది. ఖలిద్ షా(10 బంతుల్లో ఫోర్, 6 సిక్స్లతో 42), జహూర్ ఖాన్(11 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 37 నాటౌట్) రాణించారు. భారత్ బౌలర్లలో స్టువర్ట్ బిన్నీ(3/31)నే మూడు వికెట్లు తీసాడు. భరత్ చిప్లి, షెహ్బాజ్ నదీమ్కు ఓ వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 6 ఓవర్లలో 4 వికెట్లకు 129 పరుగులే చేసింది. కెప్టెన్ రాబిన్ ఊతప్ప(10 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్లతో 43), స్టువర్ట్ బిన్నీ రాణించినా ఫలితం లేకపోయింది. యూఏఈ బౌలర్లలో అకిఫ్ రాజా, సంచిత్ శర్మ, ముహమ్మద్ జుహైబ్ తలో వికెట్ తీసారు.
India needed 32 in 6 balls:
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 2, 2024
Stuart Binny - 4,WD,6,6,6,6,1. India lost by just 1 run. 💔 pic.twitter.com/qyhKWWyqe6
ఈ టోర్నీలో భారత్కు ఇది వరుసగా రెండో పరాజయం. పాకిస్థాన్తో జరిగిన తొలి మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఆరు ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన పాకిస్థాన్ ఆరు బంతులు మిగిలుండానే 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని సాధించింది.
ఏడేళ్ల తర్వాత మళ్లీ మొదలైన హాంకాంగ్ క్రికెట్ సిక్సెస్ టోర్నీలో మొత్తం 12 జట్లు పాల్గొంటున్నాయి. గ్రూప్-సీలో భారత్, పాకిస్థాన్తో పాటు యూఏఈ ఉంది. ఈ టోర్నీలో ప్రతి జట్టులో ఆరుగురు ప్లేయర్లే ఉంటారు. ఓ మ్యాచ్లో ప్రతి జట్టు ఆరు ఓవర్లు ఆడుతుంది.